ఈ సంవత్సరంలో భారత్ దేశం కరోనా వల్ల ఎన్నో సమస్యలును చవిచూసింది. ఇదే సమయంలో ఇంకొక్క విపత్కర పరిస్థితి ఎదురు అవుతుంది అని తాజా అధ్యనంలో తేలింది. మన దేశ ఉత్తర సరిహద్దులో తలమానికంగా ఉన్న హిమాలయలకు పెద్ద ప్రమాదం పొంచి ఉంది అని శాస్త్రవేత్తలు తెలియచేస్తున్నారు. పర్వతాలలో ఈ సంవత్సరం చివరి నాటికి భూకంపం వచ్చే లక్షణాలు ఉన్నాయి అని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్–కోల్కతా సంస్థ చేసిన పరిశోధనలో తేలింది. రిక్టర్ స్కేల్ ఫై 8 కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవించవచ్చు అని అధ్యనం చెప్తుంది. ఈ భూకంపం వల్ల మునుపెన్నడూ లేని విధంగా భారీ సంఖ్య లో మరణాలు సంభవించునట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్–కోల్కతా, అమెరికాలోనే నెవాడా విశ్వవిద్యలయం పరిశోధకులతో కూడిన బృందం తెలిపింది.
జర్నల్ ఆఫ్ సీస్మోలాజికల్ రీసెర్చ్ లెటర్స్ లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం. భౌగోళిక చారిత్రక మరియు భౌగోళిక డేటా పరిగణలోకి తీసుకొని మూత్రికా విశ్లేషణ,రేడియో కార్బన్ విశ్లేషణ వంటివి చేపట్టింది అని జర్నల్ ఆఫ్ సీస్మోలాజికల్ రీసెర్చ్ లెటర్స్ లో ప్రచురించారు.ఈ పరిశోధనలో కీలకంగా ఉన్న పరిశోధకుడు స్టీవెన్ జి. వోస్నోస్కి మాట్లాడుతూ హిమాచల్ ప్రాంతం తూర్పున అరుణాచల ప్రదేశ్ నుండి పశ్చిమాన పాకిస్తాన్ వరకు విస్తరించి ఉంది కాబట్టి దాని ప్రభావం రెండు దేశాలకు ఉండవచ్చని గతంలో సంభవించిన భూకంపాలకు ఈ ప్రాంతం కేంద్రంగా ఉందని తెలిపారు. ఈ విపత్తు సంభవిస్తే, చండీగఢ్డె, హ్రాడూన్ మరియు నేపాల్ లోని ఖాట్మండు వంటి పెద్ద నగరాలకి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. హిమాలయాలు మన దేశ ఉత్తర సరిహద్దులో రక్షణ కవచాలుగా ఉండి తీవ్ర చలికాలంలో మధ్య ఆసియా నుంచి వచ్చే చల్లటి గాలులను అడ్డుకుంటూ ‘రుతు పవన తరహా శీతోష్ణస్థితి’ కి కారణంగా నిలుస్తున్నాయి.