కరోనా కారణంగా సమాజంలో మానవతా విలువలు నశించిపోతున్నాయి. లేనిపోని భయాలతో ప్రజలు కరోనా వల్ల చనిపోయినవారి బంధువులను ఇబ్బంది పెడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో కరోనా సోకి ఒక మహిళ చనిపోగా ఆమెకు దహన సంస్కారాలు నిర్వహించే సమయంలో స్థానికులు వచ్చి అడ్డుకున్నారు.
కరోనా కారణంగా చనిపోయిన వారికి ఇక్కడ దహన సంస్కారాలు నిర్వహించకూడదు అంటూ ఆమె కొడుకు కారుపై రాళ్లు రువ్వారు. వివరాల్లోకి వెళితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్న ఎయిర్ మ్యాన్ తల్లి మూడు రోజుల క్రితం కరోనా కారణంగా చనిపోయారు. దహన సంస్కారాల నిమిత్తం నిన్న గ్వాలియర్ నుండి ఏలూరు చేరుకున్న ఎయిర్ ఫోర్స్ ఉద్యోగిని అడ్డుకుని స్థానికులు దహనసంస్కారాలు నిర్వహించకూడదు అంటూ అడ్డుకున్నారు. అనంతరం పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపుచేసి దహనసంస్కారాలు నిర్వహించేలా చూసారు.