Flowers: ప్రక్కవాళ్ళ పూలతో
రోజూ ఉదయం పూజ కోసమని చాలామంది ప్రక్కవాళ్ళ చెట్ల పూలు కోసేస్తుంటారు. కొంతమంది ఐతే వాకింగ్ ( Walking ) కి ఒక కవరు పట్టికెళ్ళి దారిలో కనపడ్డ మొక్కల పువ్వులన్నీ కోసేస్తుంటారు.మరి ప్రక్కవాళ్ళ పూలు కోసేసి చేసే పూజకి ఎలాంటి ఫలితం వస్తుంది ?దీనిగురించి శాస్త్రాలు ఏమంటున్నాయి ?తెలుసుకుందాం..మొక్కలు పెంచిన యజమానికి కూడా మొత్తంపూలు కోసుకునే అధికారం ఎంతమాత్రం లేదు. పూజ కోసం పువ్వు లు కోసుకోవల్సి వస్తే … మొక్కని ప్రార్దించి కొన్ని పువ్వులు మాత్రమే కోసుకోవాలి. మొక్కకి ఉన్న అన్నీ పువ్వులు ( Flowers ) కోసేయడం అనేది మహా పాపం గా చెప్పబడింది.
Flowers: అనుమతి లేకుండా
యజమానుల అనుమతి లేకుండా పువ్వులు కోయడం అనేది దొంగతనం గా లెక్కవేయబడుతుంది. దానికి శిక్షగా తరువాతి జన్మలో వారు భయంకరం గా ఉండే అడవిలో కోతి గా జన్మిస్తారు పు . ఎప్పుడు పూవులు కావలసి వారిని అడిగి కోసుకోవాలి. అలా కోసుకున్న కూడా మొక్కల యజమానికి మీ పూజలో సగం పుణ్యం వెళ్తుంది . ఈ విషయాలు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు స్వయంగా గరుడపురాణం లో గరుడునికి తెలియచేసారు. తాంబూలము, పళ్ళు , పువ్వులు మొదలైన వాటిని దొంగిలించినవాడు అడవిలో కోతిగాను ,పాదుకలు, గడ్డి, ప్రత్తి వంటి వాటిని అపహరించినవాడు మేక జన్మపొందుతారు.
మానవ జన్మ
పూజ చేసేది పుణ్యం రావాలని , మంచి జరగాలని. ప్రక్కవాళ్ళ పువ్వులు కోసి పూజ చేయడం వలన .. పుణ్యం సంగతి ఎలా ఉన్న..తరువాతి జన్మలో జంతువుగానే పుట్టాల్సి వస్తుంది. ఒక్కసారి మానవ జన్మ నుండి వెళ్ళాక మళ్ళీ ఎన్నో వేల జన్మల తర్వాతగానీ మనిషిగా పుట్టే అవకాశం రాకపోవచ్చు. మరి ఇలాంటి పూజలు ఎంతవరకు అవసమో అలోచించి జాగ్రత్త పడండి