సినిమా ఇండస్ట్రీలలో కొన్ని కాంబినేషన్స్ లో వచ్చిన సినిమాలు అద్భుతమైన సక్సస్ లను సాధిస్తుంటాయి. అలాంటి కాంబినేషన్స్ కి ప్రేక్షకులో విపరీతమైన క్రేజ్ కూడా నెలకొంటుంది. హీరో – హీరోయిన్, హీరో – దర్శకుడు, హీరో – మ్యూజిక్ డైరెక్టర్, – డైరెక్టర్ – మ్యూజిక్ డైరెక్టర్, నిర్మాత – దర్శకుడు, నిర్మాత – హీరో, దర్శకుడు – రచయిత. ఈ కాంబినేషన్స్ లో వచ్చిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలని అందుకున్నాయి.
అయితే ఎవరూ ఎప్పుడు ఒకే పొజిషన్ లో ఉండాలనుకోరు. పై స్థాయికి వెళ్ళాలనుకుంటారు. ముఖ్యంగా రచయిత.. దర్శకుడిగా మారాలనుకుంటాడు. అలాంటప్పుడు ఒక సూపర్ హిట్ కాంబినేషన్ సపరేట్ అవ్వాల్సి వస్తుంది. అలా అయిన సూపర్ హిట్ కాంబినేషన్స్ దర్శకుడు సురేందర్ రెడ్డి – రచయిత వక్కంతం వంశీ. ఈ ఇద్దరి కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా కిక్, రేసుగుర్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను దక్కించుకున్నాయి. అయితే కిక్ 2 నిరాశ పర్చడంతో వీరి కాంబోకు బ్రేక్ పడింది.
కారణాలు ఏవైనప్పటికి ఇద్దరి మద్యన గ్యాప్ మాత్రం వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు సురేందర్ రెడ్డి – వక్కంతం వంశీ కలిసి ఒక స్ర్కిప్ట్ పై వర్క్ చేస్తున్నారట. ఆ సినిమాను పవన్ కళ్యాణ్ చేయబోతున్నాడట. వంశీ రాసిన కథ రామ్ తాళ్లూరి వద్దకు వెళ్లగా దానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించబోతున్నాడు. అలా వీరిద్దరు మళ్లీ కలిసి పని చేస్తున్నారని తెలుస్తుంది.
దాదాపు అయిదు సంవత్సరాల తర్వాత వీరిద్దరు కలిసి వర్క్ చేస్తున్నారు కనుక తప్పకుండా ఇది మరో కిక్ లేదా రేసుగుర్రం రేంజ్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ అవుతుందని అందరు భావిస్తున్నారు. వంశీ చెప్పిన కథ నచ్చడంతో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ప్రస్తుతం పవన్ చేస్తున్న సినిమాలు పూర్తి అయిన తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమాకు పవన్ కళ్యాణ్ డేట్లు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.