తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ వ్యవస్థాపకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరాావు (కేసిఆర్) ఈ రోజు జాతీయ పార్టీ బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కీలక పరిణామంపై ఆ పార్టీ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ సంబరాలు చేస్తున్నాయి. దేశ్ కీ నేత కేసిఆర్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇదే సమయంలో వివక్షాలు మాత్రం కేసిఆర్ జాతీయ పార్టీ ప్రారంభించడంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
కూట్లో రాయి తీయలేనోడు .. ఏట్లో రాయి తీయడానికి పోయినట్టుంది – ఈటెల
తెలంగాణలో ఉద్యమంలో, కేసిఆర్ మంత్రివర్గంలో పని చేసి ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న ఈటెల రాజేందర్ మాట్లాడుతూ .. బీఆర్ఎస్ స్థాపనతో తెలంగాణతో కేసిఆర్ కు ఉన్న సంబంధం తెగిపోయిందని అన్నారు. టీఆర్ఎస్ తో తెలంగాణ ప్రజానీకానికి ఉన్న అనుబంధం ముగిసిపోయిందని పేర్కొన్నారు. అక్రమంగా సంపాదించుకున్న డబ్బుతో దేశంలో రాజకీయాలను నడపాలని కేసిఆర్ పగటి గలలు కంటున్నారని విమర్శించారు ఈటెల. కూట్లో రాయి తీయలేనోడు .. ఏట్లో రాయి తీయడానికి పోయినట్లుందని అన్నారు. తెలంగాణ సాధన కోసం వచ్చిన ఉద్యమ పార్టీని కేసిఆర్ ఖతం చేశారని విమర్శించారు. తెలంగాణ కోసం ప్రాణాలు ఆర్పించిన ఉద్యమ కారులను కూడా మర్చిపోయేలా, పూర్తిగా కేసిఆర్ ముద్ర మాత్రమే ఉండేలా జాతీయ పార్టీని స్థాపించారని అన్నారు.
వినాశకాలే విపరీత బుద్ది – రేవంత్ రెడ్డి
వినాశకాలే విపరీత బుద్ది అన్నట్లుగా కేసిఆర్ తీరు ఉందని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ పదం కూడా వినిపించకుండా కేసిఆర్ కుట్ర చేస్తున్నారని అన్నారు. తెలంగాణ హంతకుడిని వదిలే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో కేసిఆర్ ఆర్ధిక, రాజకీయ ప్రయోజనాలకు కాలం చెల్లిపోయిందని చెప్పారు. తెలంగాణ అస్థిత్వాన్ని కేసిఆర్ చంపేశారని అన్నారు. కుటుంబ సభ్యుల తగాదాలు పరిష్కారం, రాజకీయ దురాశ కోసమే బీఆర్ఎస్ పార్టీని తెరపైకి తెచ్చారని విమర్శించారు రేవంత్ రెడ్డి. రాబోయే కాలంలో ప్రపంచ రాష్ట్ర సమితిని కేసిఆర్ ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని సెటైర్ వేశారు.
టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం అనేది పందికి లిప్స్టిక్ రాయడమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ట్విట్టర్ టిల్లు (కేటిఆర్) ఆటను మార్చగలరని అనుకున్నారు, తండ్రి మాత్రం పార్టీ పేరు మార్చారు. అయితే వాళ్ల తలరాతను ప్రజలు మారుస్తారని బండి సంజయ్ వ్యంగ్యంగా విమర్శించారు.
కేసిఆర్ జాతీయ పార్టీ ప్రకటన వేళ ప్రగతి భవన్ కు ఆ పొరుగు రాష్ట్రాల నేతలు
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?