తెలంగాణ రాష్ట్ర ఖజానాకు వాణిజ్య పన్నుల శాఖ వెన్నెముకగా నిలుస్తోంది. రాష్ట్ర రాబడుల్లో చాలా వరకు ఈ శాఖ నుంచే పన్నులు చేకూరుతున్నాయి. ముఖ్యంగా వాణిజ్య పన్నుల శాఖ ద్వారా పెట్రోల్, డీజిల్, మద్యం అమ్మకం పన్ను, జిఎస్టి రాబడు ల ద్వారా అంతకంతకు వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం పెరుగుతోందని చెప్పాలి.. ఇకపోతే ఈ ఆర్థిక సంవత్సరం సుమారుగా రూ. 60 వేల కోట్ల ఆదాయం వస్తుంది అని అధికారులు కూడా అంచనా వేయగా.. ఆ అంచనాలను తలకిందులు చేస్తూ రూ. 70 వేల కోట్ల మేర ఆదాయం వాణిజ్య శాఖకు లభించింది.
ఒకరకంగా చెప్పాలి అంటే రాష్ట్ర రాబడుల్లో వాణిజ్య శాఖ నుంచి 60 శాతానికి పైగా రాబడి లభిస్తోంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఈ శాఖ ఆదాయం ఇప్పటికే రూ.70,000 కోట్లకు చేరుకోగా నెలాఖరులోపు మరో రూ.2 వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వాణిజ్య పన్నుల శాఖకు సగటున ప్రతినెల 7వేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వచ్చే చేరుతోంది. దీంతోపాటు పెట్రోల్ డీజిల్ అమ్మకాలు కూడా రాష్ట్రంలో భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఈ ఏడాదిలోనే అత్యధికంగా జనవరిలో రూ.1402 కోట్ల పెట్రోలియం ఉత్పత్తులపై అమ్మ కప్పు పన్ను రూపంలో రాగా.. మద్యాన్ని అమ్మినందుకు పన్ను ఎక్స్చేంజ్ డ్యూటీ రూపంలో సుమారుగా రూ.31.077 కోట్ల రూపాయల రాబడి లభించింది.
మద్యం అమ్మకం పన్ను ద్వారా రూ.14,905 కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ రూపంలో రూ.16,596 కోట్ల ఆదాయం ఆ శాఖకు సమకూరడం గమనార్హం. ఇకపోతే వాళ్ళు చెప్పనుల శాఖ 70 వేల కోట్ల ఆదాయాన్ని అర్జించినందుకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వాణిజ్య పనుల శాఖ సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఇకపోతే ఈ నెలాఖరు నాటికి ఆ శాఖ రూ. 72,000 కోట్ల లక్ష్యాన్ని చేరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.