ఏపీ మంత్రి కొడాలి నాని ముల్లును ముల్లుతోనే తీశారు .వజ్రాన్ని వజ్రంతోనే కోశారు.చంద్రబాబు బిసి కార్డును ఆయనపైకి తిప్పికొట్టారు.
దీంతో టిడిపి అధినేత ఇక మాట్లాడలేని పరిస్థితి తెచ్చిపెట్టారు.మచిలీపట్నంలో జరిగిన వైసిపి నేత మోకా భాస్కరరావు హత్య కేసులో కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్టు చేయడంపై చంద్రబాబు స్పందిస్తూ బిసి కార్డు బయటకు తీయడం తెలిసిందే.గతంలో మాజీ మంత్రి అచ్చన్నాయుడు అరెస్టు విషయంలోనూ టిడిపి బిసి నినాదం ఎత్తుకోవడం విదితమే.ఇల టీడీపీ నేతలు ఎవరిని అరెస్టు చేసినా వెంటనే కులం కార్డ్ తీస్తున్నారు చంద్రబాబు.
ఆయనతో పాటు మిగిలిన టీడీపీ నేతలు కూడా మైకుల ముందుకొచ్చి బీసీ కార్డు బయటకు తీస్తున్నారు. ఈ క్రమంలో కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడులు మాత్రమే బీసీలు కాదన్నట్లుగా మొదలెట్టిన కొడాలి నాని … తమ పార్టీలోని బలహీన వర్గాలకు చెందిన మోకా వంటి నాయకులని చంపించి.. వైసీపీని బలహీనపరచాలన్న కుట్రను టీడీపీ నేతలు పన్నారని అన్నారు.పనిలో పనిగా మోకా భాస్కర్ రావు హత్యకేసులో కొల్లు రవీంద్ర పాత్రతోపాటుగా దేవినేని ఉమా, చంద్రబాబుల హస్తం కూడా ఉండి ఉంటుందని నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. మంత్రిస్థానంలో ఉన్న నాని ఇలాంటి కామెంట్లు చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది! వైసీపీలో పేర్నినానికి ప్రధాన అనుచరుడిగా ఉన్న మోకా..
మచిలీపట్నంలో కీలక నేతగా ఎదుగుతున్న ఎదుగుదలను చూసి రవీంద్ర, నాంచారయ్య తట్టుకోలేకపోయారని,. అందుకే మోకాను అడ్డు తొలగించుకోవాలని హత్యారాజకీయాలకు తెరతీశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతరం నాని కూడా బీసీ కార్డు బయటకు తీశారు.దీంతో.. బాబు రెగ్యులర్ గా వాడే బీసీ కార్డునే నాని కూడా తిరిగి బాబుపై ప్రయోగించినట్లయ్యిందని కామెంట్లు వస్తున్నాయి. దీంతో ఇక రవీంద్ర విషయంలో.. బీసీ కార్డును టీడీపీ నేతలు వాడే అవకాశం లేకుండా చేశారనే కామెంట్లూ వినిపిస్తున్నాయి!!ఏదేమైనా జగన్ మంత్రుల్లో మాటల మాంత్రికునిగా కొడాలి నాని పేరు తెచ్చుకున్నారు.నాని నోట్లో పడితే అంతే సంగతులని టిడిపి నేతలు కూడా భయపడిపోతున్నారు.