టీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలంగాణ రాజకీయాల్లో దాదాపు క్లోజ్ అయ్యే పరిస్థితికి వచ్చేసినట్లు తెలుస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికల లాగానే అదేవిధంగా గ్రేటర్ ఎన్నికల లో వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు చేరిందని విశ్లేషకులు అంటున్నారు. కారణం చూస్తే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత లో సరైన సమన్వయం లేకపోవటంతో పాటు గ్రూపు రాజకీయాల వల్లే పార్టీ డామేజ్ అయినట్లు కింద కేడర్ నుండి వినబడుతున్న టాక్.
ఇదిలా ఉండగా ఇప్పటికే కాంగ్రెస్ ఓటమికి పిసిసి చీఫ్ గా నిన్నటి వరకు ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో పీసీసీ చీఫ్ గా పార్టీ హైకమాండ్ రేవంత్ రెడ్డి నీ నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి గత నెలలోనే పిసిసి పదవిని రేవంత్ రెడ్డికి కట్టబెట్టడం జరిగిందట.
అయితే జిహెచ్ఎంసి ఎన్నికల మందు అయితే పబ్లిక్ లో నెగిటివ్ వచ్చే అవకాశం ఉండటంతో హైకమాండ్ ఈ విషయాన్ని ప్రకటించకుండా దాచినట్లు తెలంగాణ రాజకీయ వర్గాల్లో టాక్. పైగా అధ్యక్ష పదవి చేపట్టిన వెంటనే జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు వచ్చే అవకాశం లేకపోవడంతో రేవంత్ రెడ్డి నాయకత్వానికి మొదటి లోనే మరక పడే అవకాశం ఉండటంతో ఐరన్ లెగ్ అనే ముద్ర పడే పరిస్థితులు పార్టీలో ఉంటాయని హైకమాండ్ భావించినట్లు సమాచారం. అయితే తాజాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో అన్ని రకాలుగా పార్టీని దూకుడుగా నడిపించడంలో మాత్రమే కాక పోలారైస్ చేయడం, హడావిడి చేయడంతోపాటు ప్రత్యర్థులపై భారీస్థాయిలో విరుచుకు పడే నేత కావటంతో పార్టీకి ఊపు తెచ్చే అవకాశం ఉండటంతో పిసిసి పదవిని రేవంత్ రెడ్డికి కట్టబెట్టడానికి కాంగ్రెస్ హైకమాండ్ ఈనెల 9వ తారీఖు గాని వచ్చే నెల 9వ తారీఖు గాని ముహూర్తం ఫిక్స్ చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.