దుబ్బాక ఉప ఎన్నికలలో పోలైన ఓట్లు బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణం అన్నట్టుగా మారిపోయింది. పోటాపోటీ టీఆర్ఎస్ బీజేపీ పార్టీల మధ్య నెలకొనగా కాంగ్రెస్ అసలు పోటీ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉండే కీలక నేతలపై అసమ్మతి సెగ పెరుగుతుంది.
పార్టీలో బలమైన నాయకులు ఉన్న నలుగురు ఎంపీలు కలిగిన కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం సత్తా చాట లేకపోయిందని.. పార్టీకి సరైన నాయకుడు ముందుండి నడిపించేవాడు లేరని తెలంగాణ రాజకీయాలలో సరికొత్త టాక్ వినపడుతోంది. ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన సమయం లో పార్టీలో ఉండే నాయకులు ఎవరికి వారు తమ స్వార్థం కోసం వ్యవహరించడం వల్లే టీ.కాంగ్రెస్ గ్రాఫ్ ఉన్న కొద్ది తగ్గుతుంది అనే మాటలు వస్తున్నాయి.
గ్రౌండ్ లెవెల్ లో ఉండే కార్యకర్తలు కూడా ఇదే స్వరం వినిపిస్తున్నారట. పరిస్థితి ఇలా ఉండగా టీ కాంగ్రెస్ పార్టీ పై పూర్తిగా పట్టు రేవంత్ రెడ్డికి అందించే విధంగా హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలని.. కాంగ్రెస్ కార్యకర్తలు కోరుతున్నారట. సీఎం కేసీఆర్ ని ఢీ కొనాలంటే… తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరగాలంటే రేవంత్ రెడ్డి కి సరైన పదవి అప్ప చెపితే ఖచ్చితంగా టీ-కాంగ్రెస్ తెలంగాణ రాజకీయాల్లో కీరోల్ పోషిస్తుంది అని అంటున్నారు.