Revanth Reddy : కాంగ్రెస్ పార్టీ నేత ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశంలో ఇప్పటికి ఇప్పుడు జమిలి ఎన్నికలు జరిగితే దేశం రెండుగా చీలిపోవడం గ్యారెంటీ అని భారీ డైలాగులు వేశారు. అంతేకాకుండా ప్రధాని మోడీ, కేసీఆర్ ఇద్దరు ఒకరిని మించి మరొకరు అబద్దాలు ఆడుతున్నారని, ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అబద్ధాలతో జనాలను మోసం చేయడంలో కేసిఆర్ మోడీ కి వెన్నతో పెట్టిన విద్య అని పేర్కొన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి .. దేశ అధ్యక్షుడు కావటానికి దక్షిణ భారతదేశం ఓట్లు అవసరం లేదని, అధ్యక్షుడికి నేరుగా ఎన్నికలు జరిగితే దక్షిణ భారత ప్రజలు గుడ్డు సున్నాగా మారటం గ్యారెంటీ అని పేర్కొన్నారు. దేశ విభజన జరిగితే ఖచ్చితంగా దక్షిణ భారతదేశం అత్యంత ధనిక దేశం అవుతుందని స్పష్టం చేశారు. మోడీ ప్రధాని అయ్యాక దక్షిణాది రాష్ట్రాల కి సరైన ప్రాధాన్యత ఇవ్వకుండా ఎర్రవల్లి తీసుకుంటున్నారని కేంద్ర మంత్రి పదవులను కూడా ఉత్తరాది వారికి కట్టబెడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే అసలు దేశంలో టాక్స్ కట్టే వాళ్లు ఈ రాష్ట్రానికి చెందిన వాళ్లని, కానీ నిధులు మాత్రం ఉత్తరాది ప్రాంత ప్రజలకు మోడీ కేటాయిస్తున్నారని మండిపడ్డారు. దక్షిణాది రాష్ట్ర ప్రజల పట్ల వివక్షత చూపుతూ నిర్వహించే జమిలి ఎన్నికల విషయంలో మోడీ వెనక్కి తగ్గాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇదే తరుణంలో కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.