తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ పదవి విషయంలో ఇటీవల రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఠాగూర్ అందరి అభిప్రాయాలను తీసుకుని నివేదిక రూపంలో హైకమాండ్ కి ఇవ్వటం తెలిసిందే. ఇదిలా ఉంటే తెలంగాణ పీసీసీ పదవి కోసం టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా మంది సీనియర్ నాయకులు రాహుల్ గాంధీతో భేటీ అవడానికి అనేక ప్రయత్నాలు చేయటం జరిగింది.
కానీ ఎవరికి కూడా పెద్దగా అపాయింట్మెంట్ దొరికినట్టు దాఖలాలు లేవు. ఇటువంటి తరుణంలో ఢిల్లీ హైకమాండ్ నుండి రేవంత్ రెడ్డికి పిలుపు రావడంతో టీ కాంగ్రెస్ నాయకులలో టెన్షన్ నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు రేవంత్ రెడ్డి కి పదవి కాయం అన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో టాక్ వస్తోంది.
ఫైర్ బ్రాండ్ కావడంతోపాటు కెసిఆర్ తోటి డి అంటే డి అన్నట్టుగా వ్యవహరించే సత్తా ఉన్న నాయకుడిగా హైకమాండ్ దృష్టిలో రేవంత్ రెడ్డికి మంచి ఇమేజ్ వున్నట్లు దీంతో ఇటువంటి తరుణంలో పార్టీకి ఇటువంటి నాయకుడే కీలకమని డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా టీ-కాంగ్రెస్ పీసీసీ పదవి విషయంలో చాలా ఆశలు పెట్టుకున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ ఇప్పుడు బాగా టెన్షన్ పెట్టిస్తున్నట్లు టాక్ వస్తుంది.