RGV: సంచలన దర్శకుడు వివాదాల రామ్ గోపాల్ వర్మ తాజాగా సోషల్ మీడియా వేదికగా మరో కాంట్రవర్సీకి తెరలేపాడు. ఎప్పుడు ఏదో ఒక అంశంపై వివాదాస్పద ట్వీట్లు చేయడం.. దానితో ట్రెండింగ్లో ఉండటం.. వర్మకు అలవాటు. ఆర్జీవి మాట్లాడినా సంచలనమే… మాట్లడక పోయినా సంచలనమే.
నిత్యం ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్. అంతా ‘నా ఇష్టం’ అంటూ ఎవరి మాటలను లెక్కచేయడు.ఎప్పుడు రామ్ గోపాల్ వర్మ ఎవరిని కెలుకుతాడా ఎవరికీ అర్థం కాదు.ఎందుకు వాళ్లను టార్గెట్ చేస్తాడో అది అవగతం కాదు.నిన్నగాక మొన్న కరోనా బారిన పడిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద రామ్ గోపాల్ వర్మ కొన్ని వివాదాస్పద ట్వీట్లు చేయగా మెగా బ్రదర్ నాగబాబు తీవ్రంగా స్పందించి ఊరకుక్కలంటూ ఆర్జీవీ నుద్దేశించి కౌంటర్ ఇవ్వడం తెలిసిందే. అది ఇ౦కా ట్రెండింగులో ఉండగానే అలాంటి వర్మ దృష్టి ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ మీద పడింది.
RGV: లోకేష్ వైరస్,తారక్ టీకా అంటూ తాజా ట్వీట్!
తెలుగు దేశం పార్టీ కి నారా లోకేష్ అనే ప్రమాదకరమైన సూక్ష్మ జీవి పట్టుకుంది.. అది ప్రాణాంతక వ్యాధి అని సంచలన కామెంట్స్ చేశాడు.. అంతేకాదు. ఆ వైరస్ నివారణగా పనిచేసే ఏకైక టీకా ఉందని.. దాని పేరే తారక్9999 అని సూచించాడు. టీడీపీ కార్యకర్తలకు తన సలహా విని.. త్వరపడి.. తెలుగు దేశం పార్టీకి టీకా వేయండి అని ఉచిత సలహా ఇచ్చాడు. లేదా మీరందరూ ఆ వైరస్ బారిన పడి చచ్చిపోతారని వర్మ ట్వీట్ చేశాడు.
ఇదేమీకొత్త కాదు!
గతంలో కూడా తెలుగు దేశం పార్టీపై ఆయన వివాదాస్పద కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.. టీడీపీకి అసలు వారసుడు నారా లోకేష్ కాదని, ఆ పార్టీ భవిష్యత్ జూనియర్ ఎన్టీఆర్ తోనే ఉంటుందని ట్వీట్ చేశాడు. అప్పుడు కూడా ఆ ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. కొద్దిగా వెనక్కి వెళితే లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే ఒక సినిమా తీసి అందులో నారా చంద్రబాబు నాయుణ్ణి విలన్గానూ లక్ష్మీపార్వతిని మంచిమనిషి గాని చిత్రీకరించడం తెలిపింది.అలాగే అమ్మ రాజ్యంలో కడప బిడ్డ అనే మరో సినిమాలో లోకేష్ బాబును పప్పుతో పోలుస్తూ కించపరిచేటట్లు రాంగోపాల్వర్మ చిత్రీకరించడం జరిగింది.ఇప్పుడు ఇంకా మరింత ముందుకెళ్లి ఆయన నారా లోకేష్ ను ప్రమాదకరమైన వైరస్ తో పోల్చడం పై టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.