భారత దేశంలో మహాత్మా గాంధీని జాతిపితగా దేశ ప్రజలందరూ అభివర్ణిస్తారు. కులం, మతం, ప్రాంతం వంటి బేధాలు లేకుండా ఆయనపై అపారమైన గౌరవాన్ని చూపుతారు. ‘గాంధీ’ అనే పదం ప్రతి భారతీయుడి నరనరాల్లో లోతుగా ఇంకిపోయిన ఒక ఎమోషన్. ఇక ఇప్పుడు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గాంధీపై సినిమా తీస్తున్నాడు అన్న వార్త వింటే మీకు ఎలా ఉంటుంది?
అవును..! మనకి గాంధీని నాథూరామ్ గాడ్సే చంపిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గాడ్సే పై చిత్రం తీసేందుకు రెడీ అయిపోయాడు. కొద్దిసేపటి క్రితమే తన ట్విట్టర్ లో ‘the man who killed gandhi’ అనే తన తదుపరి చిత్రం యొక్క పోస్టర్ ని విడుదల చేశాడు.
ఇకపోతే ఆర్జివి ఆ ఫోటో ని వివరిస్తూ వేసిన ట్వీట్ లో “గాడ్సే మహాత్మాగాంధీని చంపడం వల్ల తనను తాను ఆత్మహత్య చేసుకున్నట్లు అయిందని” వివరించాడు. ఈ కింద ఉన్న ఫోటోలో కూడా గాంధీ యొక్క సగం ముఖం మరియు గాడ్సే యొక్క సగం ముఖం కలిసి ఉండడం గమనార్హం.
ఇప్పటికే ఎన్నో సంచలనమైన చిత్రాలు తీసి అనేక సార్లు విమర్శల పాలైన రామ్ గోపాల్ వర్మ భారతీయుల సెన్సిబుల్ మరియు ఎమోషనల్ ఫీలింగ్స్ కి విఘాతం కలిగించాలని వర్మ డిసైడ్ అయితే ఇప్పుడు ఉన్న వాతావరణం మరియు రాజకీయ పరిస్థితుల్లో అతనికి పెను ముప్పు పొంచి ఉంది అనే చెప్పాలి. లేక వర్మ తెలివిగా…. తన స్టైల్ కి భిన్నంగా సేఫ్ యాంగిల్ లో గా సినిమా తీస్తారా? దేనికైనా వేచి చూడాల్సిందే.