సుశాంత్ సింగ్ కేసులో రోజుకో సంచలన విషయం బయటకు వస్తోంది. ఇప్పటికే సీబీఐ రియా చక్రవర్తి సహా ఆమె కుటుంబ సభ్యులు, ఇతరులు కలిపి మొత్తం 6 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. అయితే జూన్ 14న సుశాంత్ మృతి అనంతరం జూన్ 20న రియా చక్రవర్తి ముంబై బాంద్రా డీసీపీ అభిషేక్ త్రిముఖెకు పలు మార్లు కాల్ చేసింది. ఈ క్రమంలో రియా చక్రవర్తి కాల్ రికార్డ్స్ను పలు మీడియా సంస్థలు పొందాయి.
జూన్ 20న రియా అభిషేక్కు ఒకసారి కాల్ చేసినప్పుడు 20 సెకన్ల పాటు మాట్లాడింది. అనంతరం జూన్ 21న కూడా పలు మార్లు ఆమె అతనికి కాల్ చేసింది. ఇక సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నిందితులతో కూడా అభిషేక్ టచ్లో ఉన్నాడని వెల్లడైంది. వారితోనూ అతను ఫోన్లో మాట్లాడినట్లు తేలింది. అయితే సుశాంత్ మృతి అనంతరం అభిషేక్కు రియా అసలు మ్యాటర్ను చెప్పాలనుకుందట. కానీ ఆ తరువాత ఆమె అందుకు నిరాకరించిందని తెలుస్తోంది.
కాగా సీబీఐ ఇప్పటికే కేసు దర్యాప్తు చేస్తుండగా.. ముంబై పోలీసులు ప్రస్తుతం సుశాంత్ కేసుతోపాటు అతని మేనేజర్ దిశ సలియాన్ కేసు వివరాలను కూడా సుప్రీం కోర్టుకు సమర్పించే పనిలో ఉన్నారు. మరోవైపు రియా శుక్రవారం ఈడీ ఎదుట విచారణకు హాజరైంది. ఈడీ ఆమెను అనేక మార్లు ప్రశ్నలు అడిగే సరికి ఆమె వాటికి సమాధానాలు చెప్పలేక తడబడిందని తెలుస్తోంది.