బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారంలో కొత్త కోణం వెలుగుచూసింది. ఈ కేసులో కేంద్రీయ దర్యాప్తు సంస్థ సీబీఐ ఎంట్రీ ఇచ్చిన దగ్గరనుండి మొత్తం కేసు రూపు రేఖలు మారిపోయాయి. ఈ మధ్యనే రియా సోదరుడు శౌయిక్ ను సీబీఐ అదుపులోకి తీసుకున్నారు.
డ్రగ్స్ కోణంలో ప్రస్తుతం విచారణ సాగుతోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి డ్రగ్స్ కు సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. ఇక ఇప్పుడు సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. తన సోదరుడు శౌయిక్ వద్ద నుండి డ్రగ్స్ తీసుకుని అవి సుశాంత్ సింగ్ కు ఇచ్చినట్లు రియా చక్రవర్తి విచారణలో ఒప్పుకుంది. దీంతో నార్కోటిక్స్ దర్యాప్తు సంస్థ ముందు ఆమె మరోసారి రేపు హాజరు కానుంది. ప్రస్తుతమున్న పరిణామాల నేపథ్యంలో రియా రేపు అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో.