ఏబిఎన్ ఆర్కే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి పరమ భక్తులు. ఇది అతని మాటల ద్వారా చేతల ద్వారా మనకి ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది అలాగే టీడీపీకి అనుకూలంగా వార్తలు రాయడం… ప్రత్యర్థి పార్టీ పై విపరీతమైన విమర్శలు చేయడం ఆర్కే కి ఎప్పటినుండో ఉన్న అలవాటు. అయితే ఈ మధ్యనే ఆర్కే రాసిన కొన్ని రాతల పై జగన్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కేసులు కూడా పెట్టేసింది. ఈ విషయంలో ఆర్కేకి నోటీసులు కూడా వెళ్ళిపోయాయి. ఇంకేముంది ఏబిఎన్ రాధాకృష్ణ దూకుడు తగ్గించుకుంటారు…. ఇకపై సవ్యంగా రాతలు రాస్తారు అని అంతా భావించారు. అయితే అలా జరగనేలేదు.
రాధాకృష్ణ ఈసారి మరొక కొత్త వ్యాసంతో తెరమీదకు వచ్చారు. జగన్ ను ముందు కంటే ఘోరంగా విమర్శిస్తూ అతని చెబుతున్నది ఏమిటంటే జగన్ తన వ్యక్తిగత కారణాల వల్ల రాజకీయ కారణాల వల్ల చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారని…. ఇక కమ్మ సామాజిక వర్గం మీద తన ద్వేషం ఏమాత్రం తగ్గించుకోలేదని అన్నారు. ఎంతో దుందుడుకు స్వభావం తో జగన్ ఫ్యాక్షనిస్టు లా వ్యవహరిస్తున్నాడని చెప్పిన ఆర్కే…. అతను ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్నీ వివిధ మార్గాల్లో తన ప్రత్యర్థులపై పగ సాధించేలా ఉన్నాయే తప్ప ప్రజల మేలు కోసం ఏ మాత్రం పనిచేయడం లేదని అన్నారు.
అంతే కాకుండా జగన్, గూండాలను రౌడీలను నియమించారని…. అలాగే పారిశ్రామికవేత్తలు చేత జనాలను కష్టపెడుతున్నారని…. సామాజిక మాధ్యమాల్లో అతని కోసం పనిచేసే మాఫియా ఉందని ఆర్కే విమర్శలు చేయడం గమనార్హం. ఈ రోజుల్లో సోషల్ మీడియా లో పెట్టిన పోస్టులకే ప్రజలు జైలు పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్కే నేరుగా ప్రింట్ మీడియాలో తీసుకెళ్లి ఇదంతా రాసేశారు. ఇంకా ముందుకు వెళ్ళి జగన్ కు మరింత కోపం వచ్చేలా…. “చూడబోతే జగన్ తాను జైలులో గడిపిన క్షణాలని గుర్తుతెచ్చుకొని ఆగ్రహంతో రగిలిపోయి ఏం చేయాలో అర్థం కాక ఇలా ప్రవర్తిస్తున్నార”ని ఆర్కే చెప్పడం గమనార్హం. ఇక దీనిపై ఖచ్చితంగా జగన్ అభిమానుల రియాక్షన్ ఉంటుంది. అది ఏ రేంజ్ లో ఉంటుంది అన్నదే ఇక్కడ ప్రశ్న.