తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో రాజకీయ రంగ ప్రవేశంపై సూపర్ రజనీ కాంత్ కీలక నిర్ణయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇటీవలే రజనీ ట్విట్టర్ వేదికగా, ఆ తరువాత మీడియా సమావేశంలోనూ రాజకీయ పార్టీ స్థాపిస్తున్నానని చెప్పారు. ఈ నెల 31వ తేదీన పార్టీ పేరు, జనవరిలో ఇతర వివరాలు వెల్లడిస్తానని ఇటీవల తలైవా వెల్లడించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ఇతర పనులు ఆయన వర్గీయులు చూస్తున్నారు. ఈ తరుణంలోనే రజనీ పార్టీ పేరు “మక్కల్ సేవై కట్టి” అని ఎన్నికల సంఘం ఆటోను ఎన్నికల గుర్తుగా ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. రజనీ పార్టీకి ఆటో గుర్తు వచ్చింది అన్న ప్రచారం జరగడంతో తలైవా అభిమానులు సంబరాలు కూడా చేసుకున్నారు. బాషా చిత్రంలో ఆటో డ్రైవర్ పాత్రలో “నేను ఆటో వాడ్ని, ఆటో వాడ్ని” అంటూ రజనీ పాట అభిమానులు, ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకోవడంతో ఆటో ఎన్నికల గుర్తుగా వచ్చిందనడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
అయితే అభిమానులు నిరుత్సాహానికి గురి చేసేలా దీనిపై రజనీ ప్రధాన అనుచరుడు, రజనీ మక్కల్ మంద్రం నేత విఎన్ సుధాకర్ దీనిపై ఒక ప్రకటన విడుదల చేశారు. మీడియాలో వస్తున్న వార్తలు నమ్మవద్దని ఆయన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. రజనీ మక్కల్ మంద్రం నుండి అధికారిక ప్రకటన వెలువడే వరకూ అభిమానులు ఓర్ప వహించాలని ఆయన సుధాకర్ కోరారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?