(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరం వద్ద ఆదివారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా ప్రైవేటు టూరిస్టు బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం జరిగిన సమయంలో టూరిస్ట్ బస్లో సుమారు 40మంది ప్రయాణీకులు ఉన్నారు. ఎవరికీ ప్రాణహాని జరగలేదు.పలువురు ప్రయాణీకులు స్వల్పంగా గాయపడ్డారు. పూరీ నుంచి రామేశ్వరం వైపు యాత్రికులతో వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో బస్సు నుండి మంటలు లేచాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే ప్రయాణీకులను కిందకు దించివేశాడు. ఆ వెంటనే బస్సు మొత్తం మంటల్లో కాలిపోయింది.క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.బాధితులంతా ఉత్తరాఖండ్కు చెందిన అల్వాని వాసులుగా గుర్తించారు.