దుబాయ్లో బుధవారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 12వ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై కోల్కతా నైట్ రైడర్స్ 37 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం విదితమే. కోల్కతా ప్లేయర్లు ఆ మ్యాచ్లో సమిష్టిగా రాణించడంతో అద్భుత విజయం సాధించింది. అయితే మ్యాచ్లో కోల్కతా ఇన్నింగ్స్ సమయంలో రాజస్థాన్ ప్లేయర్ రాబిన్ ఊతప్ప బంతికి ఉమ్మి రాసి కోవిడ్ సేఫ్టీ రూల్ను ఉల్లంఘించాడు.
కోల్కతా ఇన్నింగ్స్ 3వ ఓవర్లో సునీల్ నరైన్ లాఫ్టెడ్ షాట్ ఆడాడు. తరువాత బంతి పట్టుకున్న రాజస్థాన్ ప్లేయర్ రాబిన్ ఊతప్ప బంతికి ఉమ్మి రాశాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం కోవిడ్ నేపథ్యంలో బంతికి ఉమ్మి రాయడాన్ని నిషేధించారు. కావాలంటే చెమట అప్లై చేయవచ్చు. ఉమ్మి రాస్తే 2 సార్లు హెచ్చరిస్తారు. మూడో సారి కూడా అలాగే చేస్తే 5 పరుగులను పెనాల్టీగా విధిస్తారు. గతంలో పలు టీంలకు ఇలాగే జరిగింది. అయితే రాబిన్ ఊతప్ప అలా చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ వైరల్గా మారింది. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
— Simran (@CowCorner9) September 30, 2020
రాబిన్ ఊతప్ప బంతికి రాయడం ఇది మొదటిసారే. ఇంకోసారి కూడా హెచ్చరిస్తారు. తరువాత కూడా అలాగే చేస్తే 5 పరుగులను పెనాల్టీ రూపంలో అందుకోవాల్సి వస్తుంది. కోవిడ్ నేపథ్యంలో ఐసీసీ పలు ప్రత్యేక రూల్స్ ను పాటిస్తోంది. అవే రూల్స్ ను ఐపీఎల్ 2020లోనూ ఫాలో అవుతున్నారు. అయితే దీనిపై రాజస్థాన్ టీం మేనేజ్మెంట్ స్పందించాల్సి ఉంది.