ఎక్స్ ట్రా జబర్దస్త్.. అప్పుడే 300 వ ఎపిసోడ్ కు చేరుకుంది. 300వ ఎపిసోడ్ అక్టోబర్ 16న ప్రసారం కానుంది. అయితే.. దానికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.
ఆ ప్రోమోలో అయితే తెలుగు ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం ఉంది. ఎంతలా అంటే డబుల్ డోస్ వినోదం అన్నమాట. అసలు సిసలైన వినోదానికి కేరాఫ్ అడ్రస్ ఆ ప్రోమో. ఆ ప్రోమోలో ఎన్నో విషయాలు చోటు చేసుకున్నప్పటికీ.. రాకింగ్ రాకేష్ చేసిన షాకింగ్ కామెంట్స్ గురించి మాత్రం మనం మాట్లాడుకోవాల్సిందే.
తన స్కిట్ లో భాగంగా.. ఒక్కో టీమ్ లీడర్ ను స్టేజ్ మీదికి పిలుస్తాడు రాకేష్. సుడిగాలి సుధీర్ రాగానే.. సుధీర్ కు, రష్మీకి మధ్య ఉన్న విషయం గురించి డైరెక్ట్ గా స్టేజ్ మీదనే చెప్పేశాడు రాకేష్.
ఈయన పేరుకే సుడిగాలి కానీ.. ఈయనదంతా పిల్లగాలి.. అంటూ రష్మీ వైపు చూపిస్తాడు రాకేష్. ఆమె లేకపోతే ఈయన లేడు. ఈయన లేకపోతే ఆమె లేదు. వీళ్లిద్దరి మధ్య ఏం లేదని ప్రపంచానికి తెలిసేది ఎప్పుడో.. అంటూ రష్మీ, సుధీర్ గురించి చెప్పేశాడు రాకేష్.
అంటే.. నిజంగానే రాకేష్ చెప్పినట్టుగానే యాంకర్ రష్మీ, సుధీర్ మధ్య ఏం లేదా? మరి.. ఇన్ని రోజులు.. ఆ జంట మీద వచ్చిన వార్తలన్నీ ఉత్తవేనా? ఏంటో.. ఆ జంట మధ్య ఏముందో ఆ దేవుడికే తెలియాలి.