Rohit Sharma : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం గడ్డు ఫామ్ లో ఉన్నాడు. ఎప్పుడు అలవోకగా పరుగులు చేసే కోహ్లీ ఈ మధ్య ఏకంగా డక్ అవుట్ అయిపోతున్నాడు. సెంచరీలను మంచినీళ్లు తాగినంత సులభంగా చేసే కోహ్లీ ప్రస్తుతం 30 పరుగులు చేయడానికి కూడా ఆపసోపాలు పడుతున్నాడు. ఇలాంటి సమయంలో ఆ ఎఫెక్టు జట్టు మొత్తం పైన పడుతోంది.
అయితే తొలి టీ20లో భారత్ ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాభవం పొందిన తర్వాత ఇప్పుడు కింగ్ కోహ్లీ పై అనేక విమర్శలు వస్తున్నాయి. ముందుగా గత మ్యాచ్లో ఓడిపోవడానికి కారణం ఫామ్ లో ఉన్న రోహిత్ శర్మ ను పక్కన పెట్టడమే అని చాలామంది అంటున్నారు. ఈ విషయంపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ… “రోహిత్ పై పనిభారం ఒత్తిడి ఎక్కువ అయింది అని అతనికి ఇచ్చారు. అతని లాగే అన్ని ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడిన కోహ్లీ రెస్ట్ ఎందుకు తీసుకోలేదు?” అని ప్రశ్నించాడు.
కెప్టెన్ అయిన కోహ్లీ నేరుగా వెళ్లి నేను రెస్ట్ తీసుకుంటాను అని మేనేజ్మెంట్ తో చెప్పగలడా అని ఈ దిల్లీ ప్లేయర్ ప్రశ్నించాడు. అదీకాకుండా రోహిత్ 2 టి20 ల తర్వాత జట్టు లోకి వస్తే కోహ్లీ రెస్ట్ పేరుతో పక్కకి తప్పుకుంటాడా…? అని కూడా ప్రశ్నించాడు. ఇలా ఫామ్ లో ఉన్న రోహిత్ ను పక్కన పెట్టడం వల్లే భారత బ్యాటింగ్ లయ దెబ్బతిందని అందుకే తక్కువ పరుగులు చేసి ఓటమి పాలయ్యారు అని ఆరోపించారు.
అయితే ఈ విషయంలో కోహ్లీ అభిమానులు సెహ్వాగ్ మాటలపై సంతృప్తిగా లేరు. కోహ్లీ ఆస్ట్రేలియా సిరీస్ లో ఒక టెస్ట్ మాత్రమే మిగిలిన మూడు టెస్టులు ఆడలేదు. రోహిత్ మాత్రం మొత్తం సిరీస్ ఆడాడు. దాన్ని దృష్టిలో ఉంచుకొని కోహ్లీ రెండు టి20 లకు టీమ్ మేనేజ్మెంట్ రెస్ట్ కల్పించారని వారు అంటున్నారు. ఇక తర్వాత టి20 మ్యాచ్ కి అయినా రోహిత్ ఉంటాడో లేదో వేచి చూడాలి.