అంతర్వేది దేవాలయంలో రథం దగ్దమవడం అనేక మందిని కలచి వేస్తోంది. దీనిపై ఏపీఐఐసీ చైర్పర్సన్, పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంతర్వేది ఘటన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుట్ర అని ఆరోపించారు. అంతర్వేది ఘటన చంద్రబాబు కుట్ర అని ఎందుకు అంటున్నానంటే అంటూ రోజా తన వాదన వినిపించారు.
చరిత్ర చూస్తే….
తాను చంద్రబాబుపై విమర్శలు చేయడం వెనుక కారణాలు ఉన్నాయని రోజా పేర్కొన్నారు. “గతంలో తుని రైలు తగలబెట్టిన సంఘటనలో కానీ, రాజధాని రైతుల పంటపొలాలు కాల్చిన ఘటనలో కానీ తెలుగుదేశం పార్టీ వారు చేసి, వైయస్ఆర్సీపీ మీద నిందలు వేయాలని చూశారు. అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో కూడా ప్రూవ్ చేయలేకపోయారు. ఎందుకంటే మేం చేయలేదు కాబట్టి నిరూపించలేకపోయాం“ అని వెల్లడించారు.
ఇప్పుడు జగన్పై కొత్త కుట్రం
గతంలో గొడవలు, ఇప్పుడు ఒక మతాన్ని ఆపాదించాలని కొందరు చూస్తున్నారని రోజా పేర్కొన్నారు. “వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఏ విధంగానైనా చెడుగా ప్రచారం చేయాలనే ఉద్దేశంతో అంతర్వేది కుట్రకు పూనుకున్నారు. సీబీఐ ఎంక్వైరీ అని అడగడానికి చంద్రబాబుకు అర్హతే లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రాష్ట్రానికి సీబీఐ రాకూడదని జీవో ఇష్యూ చేసిన పెద్దమనిషి, తన ఆస్తుల మీద సీబీఐ ఎంక్వయిరీ వేసుకోమంటే వేసుకోనన్న పెద్దమనిషి ఈ రోజు మాత్రం సీబీఐ ఎంక్వయిరీ అడుగుతున్నారు, మేం తప్పు చేయలేదు కాబట్టి శ్రీ జగన్ మోహన్ రెడ్డిగారు తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటూ సీబీఐ ఎంక్వాయిరీకి కూడా ఆదేశిస్తూ.. కేంద్రాన్ని కోరారు“ అని జగన్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆడే కుల రాజకీయాలకు. నీతిమాలిన రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంతర్వేది రథం దగ్ధం పై సీబీఐ ఎంక్వైరీలో కుట్రదారులు ఎవరో త్వరలోనే బయటకు వస్తారని వైఎస్ జగన్ ప్రకటించారు.
పాదయాత్రలోనే జగన్
తన సుదీర్ఘ పాదయాత్రలో మహిళల కష్టాలు నేరుగా చూసి వారి కన్నీళ్లు తుడవాలన్న ఆలోచనతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమ పార్టీ మేనిఫెస్టో రూపొందించారని ఆర్కే రోజా అన్నారు. తాను ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని కూడా నెరవేరుస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా చంద్రబాబు నాయుడు పుణ్యమా అని రాష్ట్రం రూ. 3.5లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నా ఈ కరోనా విపత్కర సమయంలోనూ జగన్ మోహన్ రెడ్డి వాటిని కుంటి సాకులుగా చూపకుండా తాను ఇచ్చిన మాట ప్రకారం పేదలందరికీ అండగా ఉంటూ, ఆర్థికంగా సహాయం చేస్తూ ముందుకు వెళ్లడం అనేది ప్రతి ఒక్కరు కూడా అభినందించే విషయం అని రోజా అన్నారు. డ్వాక్రా అక్కాచెల్లెమ్మలు దాదాపుగా 90 లక్షల మంది వైయస్ఆర్ ఆసరా పథకం ద్వారా ఈరోజు లబ్ధి పొందారని అన్నారు.