ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలియుగ దైవం వెంకన్నను సందర్శించుకోవడం అనే అంశం అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణంగా మారింది.
ముఖ్యంగా డిక్లరేషన్ అంశం వివాదం రేపింది. అసలు డిక్లరేషన్ అవసరం లేదంటూ పలువురు నేతలు, మంత్రులు కామెంట్లు చేయడం చర్చకు దారి తీసింది. ముఖ్యంగా మంత్రి కొడాలి నాని చేసిన కామెంట్లు రచ్చగా మారాయి. ఇదే కోవలో ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ వస్తున్నారని ఏం చేశారంటే….
ఇదిలాఉండగా, ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్ అక్కడి నుంచి నేరుగా తిరుమల చేరుకున్నారు. రేణుగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన అనంతరం అన్నమయ్య భవన్ నుంచి ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్లో సీఎం పాల్గొన్నారు. అనంతరం తిరుమల చేరుకుని శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. రాత్రి ఏడున్నకు గరుడ వాహన సేవలో పాల్గొన్నారు. రాత్రికి సీఎం పద్మావతి అతిథి గృహంలో బసచేయనున్నారు. మరోవైపు సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ, బీజేపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. సీఎం సతీసమేతంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాలని టీడీపీ, బీజేపీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఉదయం మరోసారి శ్రీవారి దర్శనం చేసుకున్నారు.
డిక్లరేషన్ పై రోజా సంచలన వ్యాఖ్యలు
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగించుకొని తిరుమలకు విచ్చేసిన తరుణంలో ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో దర్శనాలకు డిక్లరేషన్ అవసరం లేదని ప్రకటించారు. దేవుడి దగ్గర మతాలతో పనేంటి అంటూ రోజా ప్రశ్నించారు. సీఎం జగన్ డిక్లరేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరు అంటూ రోజా ప్రకటించారు. డిక్లరేషన్ లేకుండానే పట్టువస్త్రాలు సమర్పిస్తారు అంటూ రోజా ముందే ప్రకటించారు. ఇప్పుడే కాదు ఇంకో 25 ఏళ్ల పాటు జగనే సీఎంగా ఉంటారని రోజా ఈ సందర్భంగా వెల్లడించడం గమనార్హం.
ఈ మంత్రి మాత్రం హుందాగా….
కాగా, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీసీ వెల్ఫేర్ మంత్రి వేణుగోపాల కృష్ణ మాత్రం తనదైన శైలిలో హుందాగా స్పందించారు. రాజకీయ లబ్ది కోసం అనవసర విషయాన్ని వివాదాన్ని రేపి మతానికి రాజకీయరంగు పులుముతున్నారని ఆయన మండిపడ్డారు. ముడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం జగన్ ప్రయత్నిస్తుంటే..దాన్ని కోర్టుల ద్వారా చంద్రబాబు అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ వివాదాలన్నీ తాత్కాలికమేని పేర్కొన్న మంత్రి వేణుగోపాల కృష్ణ స్వామివారి మీద అచంచలమైన భక్తి ఉండడం వల్ల పాదయాత్రకు ముందు, తరువాత కాలినడకన తిరుమల వచ్చి స్వామివారిని వైఎస్ జగన్ దర్శించుకున్నారని అన్నారు.
రోజా.. నెక్ట్ టార్గెట్
తిరుమలలో ఏపీ సీఎం వైఎస్ జగన్ డిక్లరేషన్ విషయంలో మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపిన సంగతి తెలిసిందే. బీజేపీ అయితే, ఏకంగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఆంజనేయ స్వామి దేవాలయాల్లో వినతిపత్రం అందించింది. అయితే, తన వ్యాఖ్యలపై నాని ఒకింత క్లారిటీ ఇచ్చి వివాదం సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. ఇలంటి సమయంలో రోజా చేసిన కామెంట్లు విపక్షాలకు అస్త్రంగా మారాయని అంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఇక ప్రతిపక్షాలు టార్గెట్ చేయనున్నాయని కొందరు అంచనా వేస్తున్నారు.