Bullet Bike: బుల్లెట్ బండి ఎవరికి అక్కర్లేదు? నేటి యువత ఎక్కువగా కోరుకుంటున్న బండి ఇదే. అందువలనే దానికి మార్కెట్లో అంత డిమాండ్ వుంది. అయితే కోరుకున్నంత సులువుగా దాన్ని మనం కొనలేం. ఓ సాధారణ బైక్ కన్నా దీని ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే డిసైన్ లోను, పికప్ లోను దానికదే సాటి. మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్ కూడా ఓ కారణం అని చెప్పవచ్చు. అందువలన కొంతమందికి ఇది అందని ద్రాక్షలాగా కనబడుతుంది. అయితే తాజాగా మన కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. అలా మనం చేయగలిగితే బుల్లెట్ బండిని మనం ఫ్రీగానే పొందవచ్చు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అఫర్ ఇదే..
2021 – 2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటిదాకా 4.31 కోట్లకు పైగా ITR (ఆదాయపు పన్ను రిటర్నులు) దాఖలయ్యాయి. కేవలం ఈ నెల 24వ తేదీనే 11,19,751 రిటర్నులు దాఖలైనట్టు సమాచారం. ఆదాయపు పన్ను దాఖలు చేసేందుకు తుది గడువు డిసెంబర్ 31 దగ్గర పడుతుండటంతో, పన్ను చెల్లింపుదారులు ఈ-ఫైలింగ్ చేసేందుకు త్వరపడుతున్నారు. గత ఏడు రోజులలోనే 46.77 లక్షల పన్ను రిటర్నులు దాఖలైనట్టు ఐటీ డిపార్ట్మెంట్ పేర్కొంది. ఈ క్రమంలో ITR దాఖలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా బంపర్ ఆఫర్లను ప్రకటించింది.
ఇలా చేస్తే అవి గెలుచుకొనే అవకాశం ఉంది..
దీనిలో ఓ అఫర్ ఏమిటో తెలుసా? అదే.. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ను గెలుచుకునే అవకాశం. ఈ ఆఫర్ను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మంత్రిత్వ శాఖ ప్రవేశ పెట్టింది. కామన్ సర్వీసు సెంటర్ కోసం తీసుకొచ్చిన స్పెషల్ ఆఫర్ కింద, విలేజ్ లెవల్ ఎంట్రప్రెన్యూర్లు తుది గడువు లోపల వెయ్యికి పైగా పన్ను రిటర్నులను దాఖలు చేస్తే రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ను గెలవవచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్తో పాటు లక్ష రూపాయల కమిషన్ను పొందవచ్చు. అయితే ITR దాఖలు చేసేందుకు తుది గడువు ఈ నెల చివరి వరకే ఉంది. ఇంకా 5 రోజులే గడువు మిగిలి ఉంది. ఈ 5 రోజులలో వెయ్యి ITRలను దాఖలు చేసి, ఈ బహుమతులను పొందవచ్చని ప్రభుత్వం ఊరిస్తోంది.