దేశంలో ఎక్కువ మంది రోడ్డు ప్రమాదాల వలనే మరణిస్తున్నారు..ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది..రోడ్డు ప్రమాదాలను నివారించడానికి వాహన వినియోగదారులు సురక్షిత కార్లు కొనుగోలు చేస్తున్నారు.. ఇటీవల కాలంలో వాహన వినియోగదారులు కారు కొనుగోలు చేసేటప్పుడు ధర, మైలేజ్ మాత్రమే కాకుండా ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ ఉన్న వాహనాలను కొనేందుకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.. టాటా మోటార్స్కి చెందిన బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ అందిస్తున్న కొత్త 2020 డిఫెండర్ ఎస్యూవీ యూరో ఎన్సిఎపి ఇటీవల నిర్వహించిన క్రాష్ టెస్టులో ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ను కైవసం చేసుకున్నట్లు కంపెనీ ప్రకటించింది..! కొత్త 2020 ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 మోడల్ ఎస్యూవీని ఈ పరీక్షించగా ఇది అద్భుతమైన సేఫ్టీ రేటింగ్లను పొంది, బ్రాండ్ యొక్క అత్యంత సమర్థవంతమైన, మన్నికైన మోడల్గా నిలిచింది..!
కొత్త 2020 ల్యాండ్ రోవర్ డిఫెండర్ ప్రమాద సమయంలో వృద్దులు, పిల్లల రక్షణలో 85%, భద్రతా సహాయకులకు 79%,ప్రమాదకరమైన రహదారి వినియోగదారులకు 71% సేఫ్టీ స్కోరును సొంతం చేసుకున్నట్లు ఈ టెస్ట్ రిజల్ట్స్ వెల్లడించాయి. ఈ మొత్తం ఫలితాలతో ఇది ఫైవ్-స్టార్ రేటింగ్ను సాధించింది.. ఇది అత్యాధునిక అల్ట్రా-స్టిఫ్ అల్యూమినియం-ఇంటెన్సివ్ బాడీ నిర్మాణాన్ని కలిగి ఉండి, ఎలాంటి భూభాగాలపైనైనా అద్భుతమైన భద్రతను అందించేలా దీనిని తయారు చేశారు. డిఫెండర్ ఎస్యూవీని 90,110 అనే రెండు మోడళ్లలో తయారుచేశారు. అంతేకాకుండా అనేక స్మార్ట్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇది కేవలం కారులోని ప్రయాణీకులకే కాకుండా చుట్టుపక్కల ఉండే వారికి కూడా భద్రతనిస్తుంది. ఈ కార్లలో అత్యవసర బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, రియర్ కొలైజన్ మోనిటర్, బ్లైండ్ స్పాట్ అసిస్ట్, డ్రైవర్ కండిషన్ మోనిటర్, 360-డిగ్రీ కెమెరా మొదలైన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. దీనిలో ఆరు ఎయిర్బ్యాగులు, ఈబిడితో కూడిన ఏబిఎస్, మూడు ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ సీట్ ఎంకరేజ్ పాయింట్స్ ఉన్నాయి.
ఈ విషయంపై జాగ్వార్ ల్యాండ్ రోవర్ యొక్క ప్రొడక్ట్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిక్ రోజర్స్ మాట్లాడుతూ, కేవలం డిఫెండర్ యజమానుల భద్రతను మాత్రమే కాకుండా, ఇతర రహదారి వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త 2020 డిఫెండర్ ఎస్యూవీని సృష్టించామని చెప్పారు. దీనిని ఇప్పటివరకు తయారు చేసిన వాటిలో కెల్లా అత్యంత సమర్థవంతమైన, మన్నికైనదని ఆయన అన్నారు. యూరో ఎన్సిఎపిలో ఈ కారు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ను దక్కించుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అధునాతన సేఫ్టీ ఫీచర్లతో తయారు చేసారు . దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.73.98 లక్షలు. ఈ విభాగంలో మెర్సిడెస్ బెంజ్ జి-క్లాస్ మరియు జీప్ వ్రాంగ్లర్ రూబికాన్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?