టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు దేశమంతటా రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ తర్వాత రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా ప్రభాస్ మాదిరిగా నేషనల్ వైడ్ మార్కెట్ ని ఎక్కువగా టార్గెట్ చేయబోతున్నారని అభిమానులు చెప్పుకుంటున్నారు. ఖచ్చితంగా ఆర్ ఆర్ ఆర్ సినిమా తో ఈ ఇద్దరి స్టార్ హీరోలకి రాజమౌళి పాన్ ఇండియన్ స్టార్స్ అన్న క్రేజ్ ని తీసుకువస్తాడని ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.
ఇక ఇప్పటికే చరణ్, ఎన్టీఆర్ లకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఖచ్చితంగా ఇద్దరికి బాలీవుడ్ లో తమకంటూ ఒక రత్యేకమైన మార్కెట్ ఏర్పడుతుందని అందరూ భావిస్తున్నారు. దాంతో ఇప్పటి నుంచే ఎన్టీఆర్ పాన్ ఇండియా కథలపై దృష్ఠి పెట్టాడు. ఇప్పటికే కె.జీ.ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఒక ప్రాజెక్టు ఫైనల్ అయిందని, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించబోతున్నాడని సమాచారం. అంతేకాదు ఆర్ ఆర్ ఆర్ తర్వాత చేయబోయో త్రివిక్రమ్ సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్లో రూపొందించాలని చూస్తున్నాడు.
అయితే రామ్ చరణ్ విషయంలో మాత్రం ఇప్పటి వరకు పెక్కా క్లారిటీ రావడం లేదని అభిమానులు చెప్పుకుంటున్నారట. కాని చరణ్ కూడా భారీగానే ప్లాన్స్ వేసుకుంటున్నాడని ఇన్సైడ్ టాక్. కమర్షియల్ సబ్జెక్ట్స్ చరణ్ కోసం చాలానే సిద్దంగా ఉన్నప్పటికి ప్రస్తుతం వాటి మీద దృష్ఠి పెట్టడం లేదని తెలుస్తుంది. ఇంతకముందు బాలీవుడ్ లో జంజీర్ అనే సినిమా చేసి దెబ్బ తిన్నాడు. కాని ఈ సారి ఆర్ ఆర్ ఆర్ తో బాలీవుడ్ లో తన మార్కెట్ ని క్రియోట్ చేసుకోవాలని చూస్తున్నాడట.
అందుకే టాలీవుడ్ యం డైరెక్టర్స్ వెంకీ కుడుముల, సందీప్ రెడ్డి వంగ తో పాటు అనిల్ రావిపూడి లాంటు కొందరు సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ రామ్ చరణ్ కోసం కథలు రెడీ చేసినప్పటికి ఒక్కదానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తుంది. అందుకు ముఖ్య కారణం ఆ కథలు కేవలం తెలుగులో మాత్రమే వర్కౌట్ అవుతాయని చెప్పుకుంటున్నారు. అందుకే ప్రస్తుతం చరణ్ చేస్తున్న ఆర్ ఆర్ ఆర్, ఆచార్య కంప్లీట్ అయ్యే లోపు పాన్ ఇండియన్ రేంజ్ సబ్జెక్ట్స్ ని ఫైనల్ చేసుకోవాలని కొరటాల శివ లాంటి వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నాడట.