RRR Movie: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం చేస్తుంది.. కరోనా కేసుల నమోదు సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.. రోజు రోజుకి కరోనా మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.. ఈ నేపథ్యంలో మరణాల సంఖ్య అరికట్టడానికి వైద్యులు ప్లాస్మా థెరపీ ని వాడుతున్నారు.. అయితే కరోనాను జయించిన వారు ప్లాస్మాను దానం చేయడానికి భయపడుతున్నారు.. ప్లాస్మాను దానం చేయమని ఇప్పటికే చిరంజీవి, మహేష్, వెంకటేష్, పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు పిలుపునిచ్చారు.. తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీ ప్లాస్మా ను దానం చేయండి అని ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది..
ఆర్ఆర్ఆర్ మూవీ ప్లాస్మా ను దానం చేయండి.. అంటూ “కోవిడ్ యోధులందరికీ.. మీరు కనీసం మూడు వారాల క్రితం కోరుకుంటే, మీరు ఎవరికైనా హీరో కావచ్చు.. ప్లాస్మా ను దానం చేయడానికి ముందుకు వచ్చి కరోనా వైరస్ తో పోరాడటానికి సహాయం చేయండి.. డొనేట్ ప్లాస్మా సేఫ్ లైఫ్స్.. అంటూ అద్భుతమైన ట్యాగ్ లైన్ ని జత చేసింది..
ఇప్పటికే పలు ప్రజా ప్రతినిధులు సైతం ముందుకు వచ్చి ప్లాస్మాను దానం చేసి ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.. కరోనా సోకిన కోరుకున్న వారిని నుంచి పేషంట్స్ కు ప్లాస్మాను ఎక్కిస్తే.. త్వరగా కోలుకోవడమే కాదు.. ప్రాణాపాయం నుంచి కూడా బయటపడే అవకాశం ఉంది. అందుకనే సెలబ్రిటీల నుంచి ప్రభుత్వ అధికారుల వరకు ప్లాస్మా దానం చేయండి.. ప్రాణదాతలు కండి అంటూ పిలుపునిస్తున్నారు..
To all the #Covid19 warriors out there!
If you recovered at least 3 weeks ago, you can be a HERO to someone. Come forward to donate plasma and help fight #CoronaVirus. ??#DonatePlasmaSaveLives #CovidIndia https://t.co/U5M7Ft2MWq— RRR Movie (@RRRMovie) April 24, 2021
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు టీజర్ ఈ సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేశాయి.. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.