తెలుగు సినిమా కరోనా కోరల్లో చిక్కుకుంటోంది. ఒకరి తర్వాత ఒకరు కరోనా వైరస్ బారిన పడుతున్నారు. రీసెంట్ గా రాజమౌళి, తన కుటుంబానికి కరోనా సోకిన విషయం తెల్సిందే. బండ్ల గణేష్ కరోనా నుండి కోలుకున్నారు. దర్శకుడు తేజ, కమెడియన్ పృథ్వీలకు కూడా కరోనా సోకింది.
ఇక గాయకులు బాలసుబ్రహ్మణ్యం, స్మిత కూడా కరోనా బారిన పడ్డ విషయం తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఆర్ ఆర్ ఆర్ నిర్మాత డివివి దానయ్యకు కూడా కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇంట్లోనే ఉండి ఆయన కోలుకుంటున్నారు. ఇటు దర్శకుడు, అటు నిర్మాత కూడా ఇప్పుడు కరోనా బారిన పడడంతో ఆర్ ఆర్ ఆర్ సినిమా పనులు ఎక్కడివక్కడ నిలిచిపోనున్నాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?