బాహుబలి సినిమా తో యావత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ని మాత్రమే కాక ప్రపంచ సినిమా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు మలుచుకున్నాడు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. బాహుబలి సినిమా భారీ స్థాయిలో విజయం సాధించడంతో రాజమౌళి తర్వాత సినిమా ఏంటి అన్నదానిపై ఎవరితో అన్నదానిపై రకరకాల చర్చలు అప్పట్లో జరిగాయి. కచ్చితంగా రాజమౌళి రేంజ్ పెరిగింది కాబట్టి బాలీవుడ్ ఇండస్ట్రీ హీరోలతో సినిమా చేస్తారని అందరూ భావించారు.
కానీ దానికి భిన్నంగా తనకు లైఫ్ ఇచ్చిన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే రామ్ చరణ్ అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ తో “ఆర్ఆర్ఆర్” సినిమా చేస్తున్నట్లు ప్రకటించి ఈ ఏడాది జూన్ మాసంలో రిలీజ్ చేస్తున్నట్లు సినిమా ప్రారంభం టైం లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి మరీ షూటింగ్ స్టార్ట్ చేశారు. అయితే ప్రారంభంలో ఇద్దరు హీరోలకు భారీగా గాయాలు కావడంతో కొన్ని నెలల పాటు షూటింగ్ ఆగిపోవడంతో పాటు జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్ దొరక్కపోవడంతో సినిమా విడుదల వచ్చే ఏడాది జనవరి అని ప్రకటించారు.
అయితే ఈ లోపు కరోనా మహమ్మారి రావటంతో .. దేశవ్యాప్తంగా మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా సినిమా షూటింగులు ఆగిపోవటంతో “ఆర్ఆర్ఆర్” సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అన్నది అందరిలో ఆసక్తి నెలకొన్న ప్రశ్నగా మారింది. అయితే ప్రస్తుతం సినిమా షూటింగుల్లో అనుమతులు రావడంతో “ఆర్ఆర్ఆర్” కి సంబంధించి బ్యాలెన్స్ షూటింగ్ చాలా స్పీడ్ గా కంప్లైంట్ చేస్తున్నారు డైరెక్టర్ రాజమౌళి. ఈ తరుణంలో రామ్ చరణ్ కి కరోనా పాజిటివ్ రావడంతో.. అన్ని పరిస్థితులు బేరీజు వేసుకుని వచ్చే సమ్మర్ కి సినిమా రిలీజ్ చేయటం గ్యారెంటీ అనే టాక్ వినబడుతోంది. ఈ డేట్ మాత్రం పక్కా అని సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు అంటున్నారు.