RRR: “బాహుబలి” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “RRR” పై దేశవ్యాప్తంగా అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నయి. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. బాహుబలితో దేశవ్యాప్తంగా రాజమౌళి కి విపరీతమైన క్రేజ్ ఏర్పడడంతో..”RRR” కోసం సినీ ప్రేమికులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ ఈ విషయంలో అనేక వాయిదాల పడుతూ ఉండటం తో.. ఈసారి అక్టోబర్ 13వ తారీకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేయటంతో… సినిమా ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది.
పాన్ ఇండియా మూవీ తరహాలో మాత్రమే కాక ప్రపంచ స్థాయిలో అనేక దేశాలలో వివిధ భాషలలో ఈ సినిమా రిలీజ్ అవుతుండటంతో.. ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ నెలకొంది. అటువంటి ఈ సినిమాపై స్టార్ రైటర్ సాయిమాధవ్ బుర్రా సెన్సేషనల్ కామెంట్ చేశారు. RRR లో పాత్రలకు తగ్గ రీతిలో స్క్రీన్ ప్లే డైరెక్టర్ రాజమౌళి ప్లే చేయడం జరిగిందని, చరణ్.. ఎన్టీఆర్ ల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు.. సినిమాకి హైలైట్ అవుతాయని .. ఖచ్చితంగా సినిమాలు చూసే ప్రేక్షకులకు రోమాలు నిక్క పొడుచుకునే లా.. సన్నివేశాలు ఉంటాయని సాయి మాధవ్ బుర్ర తెలిపారు.
Read More: RRR: RRR సినిమాలో రాజమౌళి మార్క్ స్పెషల్ ఫైట్ సీన్..??
అదే రీతిలో కృషి దర్శకత్వంలో పవన్కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా స్టోరీ.. నెక్స్ట్ లెవెల్ అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. రెండు సినిమాలు ఎక్కడ తగ్గే ప్రసక్తి లేకుండా స్టోరీ స్క్రీన్ ప్లే లు ఉన్నాయని ఈ స్టార్ రైటర్ చెప్పుకొచ్చారు.