దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ పాన్ ఇండియా మూవీ ”ఆర్.ఆర్.ఆర్”. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నందున అటు మెగా ఫాన్స్ మరియు ఇటు నందమూరి ఫాన్స్ లోనూ ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాలో చరణ్ ‘అల్లూరి సీతారామరాజు’ గా మరియు జూనియర్ ఎన్టీఆర్ ‘కొమరం భీమ్’ పాత్రలో కనిపించనున్నారు. కరోనా కారణంగా లాక్ డౌన్ ఉండడం తో ఈ సినిమా షూటింగ్ లేట్ అయ్యింది. లేకపోతే ముందుగా చెప్పినట్లు వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసేవారు. షూటింగులకు అనుమతి దొరకడంతో రాజమౌళి శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు.
‘యమదొంగ’ ‘మగధీర’, ‘ఈగ’, ‘బాహుబలి’ వంటి సినిమాలతో సిల్వర్ స్క్రీన్ పై విజువల్ వండర్స్ క్రియేట్ చేసే రాజమౌళి ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ ని కూడా అదే స్థాయిలో రూపొందించబోతున్నారు. రాజమౌళి తన సినిమా లో విజువల్ ఎఫెక్ట్స్ కి ఎంతటి పెద్దపీట వేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు కూడా ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో వీఎఫ్ఎక్స్ వర్క్ కి అధిక సమయం మరియు అధిక ఖర్చును పెడుతున్నట్లు సమాచారం. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో గ్రాఫిక్ వర్క్స్ ను రూపొందించడం కోసం రాజమౌళి పలు విదేశీ కంపెనీలతో వర్క్ చేస్తున్నాడు..
RRR సినిమాలో ‘బాహుబలి’ సినిమాని మించేలా విజువల్ ఎఫెక్ట్స్ ఉండేలా రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వీఎఫ్ఎక్స్ కోసమే స్పెషల్ బడ్జెట్ ను కూడా కేటాయించారట. ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ పార్ట్ కంటే ఎక్కువ ఖర్చు VFX ఎఫెక్ట్స్ కే చేస్తున్నారట. RRR సినిమా మొత్తం ఒక విజువల్ ట్రీట్ లా ఉండేలా ఉండబోయేలా మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.