డబ్బుఅధికంగా రావాలని ఎవరు కోరుకోరు చెప్పండి ! తక్కువ పెట్టుబడితో ఎక్కవ లాభం వచ్చే వ్యాపారాలు చేయడానికి ఇష్టపడుతారు. కానీ అలాంటి వ్యాపారాలు చాలానే ఉన్నప్పటికీ.. అవి అత్యంత రిస్కుతో కూడుకున్నవి కూడాను. అందుకే చాలా మంది తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం అనగానే వెనుక ముందు చాలా ఆలోచనలు చేసి మరీ పెట్టుబడులు పెట్టడం గురించి ఆలోచిస్తుంటారు. ఇలా డబ్బు సంసాదించడానికి మార్గాలు చాలనే ఉన్నాయి.
అలాంటి విషయమే ఇప్పుడు మీ కోసం. ఇక్కడ అతి తక్కువ పెట్టుబడే.. కానీ తిరిగి వచ్చే ఆదాయం దానికి రెట్టింపు స్థాయిలో ఉంటుంది. అదే స్టాక్ మార్కెట్. ఇక్కడ డబ్బు సంపాధించడం భారీగానే ఉన్నప్పటికీ.. ఇది రిస్కుతోనూ కూడుకున్న పని. విషయం పూర్తిగా తెలుసుకోకుండా.. అంటే స్టాక్ మార్కెట్ సంబంధిత విషయాలను తెలుసుకోకుండా ఈ రంగంలోకి అడుగుపెడితే… నట్టేటమునగడం కూడా ఖాయం. కాబట్టి ఈ విషయంలో సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.
అయితే, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా తక్కువ డబ్బు.. తక్కువ సమయంలోనే అధిక మొత్తంలో సంపాదించవచ్చుననే దానికి ఓ కంపెనీ స్టాక్ విలువలు నిరూపించాయి. కేవలం లక్ష రూపాయలతోనే తిరిగి రూ. 28 లక్షల ఆదాయం లభించింది. అంటే ఒక్క ఏడాది కాలంలో ఆ కంపెనీ స్టాక్ విలువ 28 రెట్లకు పైగా పెరిగి.. రికార్డు లాభాలను సంపాదించిపెట్టింది. ఆ కంపెనీయే బయోఫిల్ కెమికల్స్.
బయోఫిల్ కెమికల్స్ కంపెనీ స్టాక్ విలువ ఏడాది కాలంలోనే రికార్డు స్థాయిలో పెరిగింది. గత సంవత్సరం 2019 నవంబర్ 13న ఈ కంపెనీ స్టాక్ విలువ రూ.4.42 వద్ద ట్రేడ్ అయింది. కేవలం ఒక్క సంవత్సర కాలంలోనే అది రూ.126 చేరింది. అంటే కేవలం 12 నెలల్లోనే బయోఫిల్ కెమికల్స్ షేరు విలువ 2768 శాతం పెరిగింది. పెట్టుబడులు పెట్టిన వారికి కాసులు వర్షం కురిపించింది. దీని ప్రత్యర్థి కంపెనీలు దీని దరిదాపుల్లోకి కూడా రాకపోవడం గమనార్హం. ఒక ఏడాది కాలంలోనే ఈ స్థాయిలో ఈ కంపెనీ షేరు విలువ భారీగా పెరగడంతో వాటాదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మీరు కూడా ఏడాది క్రితం కేవలం లక్ష రూపాయల పెట్టుబడి పెట్టివుంటే మీరు రూ.28 లక్షలకు పైగా లాభాన్ని ఆర్జించేవారు. అయితే, అన్ని వేళల ఇలాంటి పరిస్థితి ఉంటుదనుకోకండి.. షేర్ మార్కెట్ పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి..!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?