ఉల్లి పాయ వెనక దాదాపు 5000 ఏళ్ళ చరిత్ర ఉంది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి . ఇది ఆసియాలో పుట్టిందని కొందరంటే … పాకిస్తాన్ లో పుట్టిందని కొందరంటారు. ఇప్పుడు అన్ని దేశాల్లో ఉల్లి పండుతుంది . ఎన్నో హార్మోన్ల గుణాలు ఉల్లి రసంలో ఉన్నాయి. టేస్తోస్తేరాన్, ఇన్సులిన్, గ్రౌత్ హార్మోన్, ఆక్షితోసిక్ వంటి లక్షణాలు ఉన్నాయి., పచ్చి ఉల్లి ఎక్కువగా తింటే గుండె మంట వస్తుంది . దీనిలో గంధకం పాలు ఎక్కువగా ఉంటుంది కావున కోసేటప్పుడు కళ్ళల్లో నీళ్లు వస్తాయి . ఉల్లిలో కేలరీలు శక్తి ఎక్కువ .. వేయిస్తే ఈ శక్తి విలువ ఇంకా పెరుగుతుంది . ఉల్లిని అన్ని కూరలలోలో వాడుతారు . విందు భోజనాల్లో ఉల్లి పెరుగు చట్ని తప్పని సరిగా ఉంటుంది.
ఉల్లిపాయ ఒక ఆంటీబయాటిక్. దీనిని తిననవసరంలేదు. కానీ మన పక్కన ఉంచుకుంటే వైరస్, బాక్టీరియాల వలన వచ్చే జబ్బులను మన దగ్గరకు రానివ్వదు. వచ్చిన జబ్బులను కూడా నయంచేస్తుంది.1919 లో ఫ్లూ (FLU) జ్వరం వచ్చి 40 మిల్లియన్ల ప్రజలు చనిపోయారు. గ్రామాలలో నివసిస్తున్న ప్రజలు ఎక్కువగా చనిపోతున్నారని తెలుసుకున్న ఒక డాక్టర్ అక్కడున్న ప్రజలను కాపాడాలని నిర్ణయించుకుని గ్రామాలకు వెళ్లేడు. ఆయన వెళ్ళిన ప్రతి గ్రామంలోనూ ఉన్న ప్రజలలో చాలామందికి ఈ జబ్బు వచ్చి చనిపోయారు. అయితే ఒక గ్రామంలో ఒక కుటుంబం మొత్తం సంతోషంగా, ఆరోగ్యంగా ఉండటం చూసిన డాక్టర్ ఆశ్చర్యపడి “ఇది ఎలా సాధ్య పడింది” అని ఆ కుటుంబీకులను అడిగేరు. అక్కడున్న ఒక రైతు భార్య “ఇదుగో దీని వలన” అంటూ ఒక పెచ్చుతీయని ఉల్లిపాయను చూపించింది. “ఉల్లిపాయలను ఒక గిన్నెలో ఉంచి ప్రతి రూములోనూ ఉంచేము…ఇది మమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతోంది” అని చెప్పింది. డాక్టర్ వారి దగ్గరున్న ఉల్లిపాయను తీసుకుని తన మైక్రోస్కోప్ లో చూసేడు. ఆ ఉల్లిపాయ నిండా ఆ ఫ్లూ వైరస్ ఉంది.
ప్రస్తుతం మార్కెట్లో ఉల్లి ధర రూ. 80 నుండి రూ.100 వరకు పెరిగిన విషయం అందరికి తెలిసిందే. ధరలను అదుపులోకి తెచ్చేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటుంది . ఈ క్రమంలోనే… ఉల్లి దిగుమతి నిబంధనలను సడలించింది. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, 1955ను కేంద్రం ఇటీవల సవరించి, ఉల్లిని ఎసెన్షియల్ కమోడిటీస్ నుండి మినహాయించింది. స్టాక్ పరిమితిని ప్రవేశ పెట్టింది. అందువలన ఉల్లిని సామాన్యులకు అందుబాటులో ఉండేల ప్రయత్నాలు చేస్తుంది.
ఇక ఉల్లి ధరలు పెరగకుండా, కొరత లేకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా… సెప్టెంబర్ 14వ తేదీన ఉల్లి ఎగుమతులకు కేంద్రం బ్రేక్ వేసింది. స్టాక్ పరిమితులపై చర్యలు తీసుకుంది. అయితే…ఎగుమతిని నిషేధించిన తర్వాత కూడా ధరలు అదుపులోక రాలేదు. దీంతో దిగుమతి నిర్ణయం తీసుకోవడంతో పాటు గోదాముల్లోని ఉల్లిని బహిరంగ మార్కెట్ కు సరఫరా చేయాలని నిర్ణయించింది. ఇరాన్, టర్కీ తదితర ఉల్లి పండించే దేశాల నుండి దిగుమతి నిబంధనలను సడలించింది. శుక్రవారం స్టాక్ పరిమితిని ప్రవేశపెట్టింది. హోల్ సేల్ వ్యాపారుల వద్ద ఇప్పుడు 25 టన్నుల వరకు, రిటైల్ వ్యాపారుల వద్ద 2 టన్నుల వరకు స్టాక్ ఉండవచ్చు.