Food : మన పెద్దల కాలం నాడు ప్రతి పని ఒక పద్దతి లో చేసేవారు..కొన్ని నియమాలు పాటించేవారు.కాలం మారుతున్నా కొద్దీ అవన్నీ మాయమయాయి.ఆ ఆకాలం వారు భోజనం Food కోసం ఎలాంటి నియమాలు పాటించేవారో తెలుసుకుందాం..
భోజనం చేయడానికి ముందు, తరువాత కూడా కాళ్ళు, చేతులు తప్పకుండా కడుక్కోవాలి.మనం బయట ఎక్కడెక్కడో తిరుగుతాం. తెలియకుండా అశుద్ధ పదార్థాలను తొక్కుతాం. అదే కాళ్ళతో రావడం వల్ల కుటుంబంలోని అందరి ఆరోగ్యాలుపాడవుతాయి. ముఖ్యంగాచంటి పిల్లల కు ఎక్కువ ప్రమాదం.
- కడుక్కున్న కాళ్ళను తడిలేకుండా తుడుచుకుని భోజనానికి వెళ్ళాలి.
- తూర్పు, ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది.
- ఆహార పదార్థాలుకూర, పప్పు, పచ్చళ్ళు, ఏవైనా కూడా వడ్డించేటప్పుడు
- తినే పళ్ళానికి తాకిస్తూ వడ్డించకూడదు .
- అలా వడ్డించడం వలన అవి ఎంగిలి అవుతాయి.
- ఎంగిలి పదార్థాలు ఎవ్వరికీ పెట్టిన కూడా దోషమవుతుంది. కాబట్టి ఆహారపదార్ధాలు పెళ్ళానికి కాస్త ఎత్తునుండి వడ్డించాలి.
- నెయ్య పేరుకుని పోయినప్పుడు చాల మంది వేడి అన్నపు పాత్రలో నేతి గిన్నెను పెట్టి వేడి చేస్తుంటారు అలాఅస్సలు చేయకూడదు.అన్నం మెతుకులు నేతి లో పడరాపడకూడదు.
- ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాచూపించకూడదు. ముట్టుకోకూడదు.
- తినే కంచాన్ని ఎడమచేతితో ముట్టుకోకూడదు. ఒకవేళ అలా కంచాన్ని ముట్టుకుంటే ..వెంటనే ఎడమచేతితో నీటినిముట్టుకోండి .
- సొట్టలుపడిన కంచం, విరిగిన కంచాలలో భోజనానికి పనికిరాదు. భోజనం చేయకూడదు .
- అరిటాకులు చాల ఉత్తమం .
- నిలబడి అన్నం తింటూ ఉంటే నెమ్మది నెమ్మది గా దరిద్రులు గా మారుతారు.
- ఉపనయనం జరిగినవారు ఆపోశనము తప్పక పట్టి గాయత్రీ మంత్రంతో ప్రోక్షణ చేసి తర్వాత భోజనం మొదలు పెట్టాలి . ఉపనయనం కాని వారు భగవన్నామము స్మరిస్తూ భోజనం చేయాలి.
- ఆపోశనము పట్టినతర్వాత ఇక ఉప్పు వడ్డించుకోకూడదు. పదార్థాలలో ఉప్పు తక్కువగా అనిపిస్తే ఆ పదార్థాలు
- ఉన్న గిన్నెలలో ఉప్పు కలుపుకుని వడ్డించుకోవాలి.
- చాల మంది ఎదో ఒక అవసరం తో భోజనం మధ్య నుంచి లేచి వెళ్తుంటారు.అలా భోజనం మధ్యలో అస్సలు లేవకూడదు.