టాలీవుడ్లో ప్రస్తుతం పాన్ ఇండియన్ సినిమాల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ది బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చేస్తున్నారు. ఈ చిత్ర దర్శకుడు రాజమౌళి పలు ట్విస్ట్లు ఇస్తూ ఉన్నాడేగానీ ఈ సినిమా విడుదల ఎప్పుడు అవుతుందో మాత్రం చెప్పడం లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సమ్మర్ టార్గెట్ గా మాత్రం ఆర్ ఆర్ ఆర్ ని ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు రాజమౌళి అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇక ఇప్పటికే ఎన్టీఆర్, రామ్చరణ్ అభిమానులు లేటెస్ట్ అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా కంప్లీట్ చేస్తూనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ వేరే ప్రాజెక్ట్ కి సంబంధించిన కథలు వింటున్నాడని అంటున్నారు. ఇదే సమయంలో తారక్ లైనప్ పై మరింత ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం స్టార్ దర్శకులతోనే కాకుండా టాలీవుడ్ లో సత్తా చాటుకుంటున్న యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకులతో కూడా పని చెయ్యాలని తారక్ భావిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ఇందులో భాగంగా క్రైమ్ థ్రిల్లర్ “హిట్” చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శైలేష్ కొలనుతో తారక్ ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్టుగా చర్చలు మొదలయ్యాయి.
అంతే కాదు ఈ యంగ్ డైరెక్టర్ రీసెంట్ గా తారక్ కు కథ కూడా వినిపించగా అది నచ్చిందని కలిసి మనం సినిమా చేద్దామని మాట ఇచ్చినట్టు సమాచారం. వాస్తవంగా ఆర్ ఆర్ ఆర్ తర్వాత తారక్ మాటల మాంత్రీకుడు త్రివిక్రం తో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటి వరకు ఇదొక్కటే అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిన ప్రాజెక్ట్. మిగవాన్ని రూమర్స్ అనే అంటున్నారు. త్రివిక్రం తర్వాత కూడా మైత్రీ మూవీస్ నిర్మాణంలో ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఉంటుందని వార్తలు వచ్చాయి. కాని తాజాగా ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ అన్న భారీ యాక్షన్ మూవీ ని ప్రకటించాడు. మరి తారక్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై క్లారిటీ రావాలంటే అఫీషియల్ న్యూస్ రావాల్సిందే.