వరసగా తెలుగు సినిమాలతో అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా మారిన కన్నడ బ్యూటి రష్మిక మందన్న కోలీవుడ్ లో కూడా అడుగు పెట్టింది. మొదటి సినిమానే స్టార్ హీరో కార్తి సరసన నటించే అవకాశం అందుకుంది. సుల్తాన్ అన్న టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కింది. కాగా రష్మిక డెబ్యూ సినిమా తమిళంలో రిలీజ్ కాకుండా మరో స్టార్ హీరో సూర్య నటించబోతున్న లేటెస్ట్ మూవీ లో రష్మిక కి అవకాశం దక్కిందని వార్తలు వస్తున్నాయి. దాంతో ఇక రష్మిక కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా సెటిలైనట్టే అని మాట్లాడుకున్నారు. కాగా తాజాగా ఈ న్యూస్ కి సంబంధించిన క్లారిటి ఇచ్చాడు దర్శకుడు.
రీసెంట్ గా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సూరారై పోట్రూ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తెలుగులో ఆకాశం నీ హద్దురా అన్న టైటిల్ తో రిలీజై తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. చెప్పాలంటే సూర్య నటించిన సినిమా చాలా కాలానికి టాలీవుడ్ లో కూడా మంచి హిట్ ని సాధించింది. దాంతో సూర్య నెక్స్ట్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. పాండిరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది.
కాగా సూర్య – పాండి రాజ్ కాంబినేషన్ లో తెరేక్కబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మోస్ట్ క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న నటించబోతుందన్న న్యూస్ వచ్చి కోలీవుడ్ మీడియాలో బాగా ప్రచారం అవుతోంది. ఇదే న్యూస్ తెలుగులోను వైరల్ గా మారింది. అయితే అసలు విషయం ఏంటో దర్శకుడు పాండిరాజ్ క్లారిటీ ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్ కి ఇంకా ఏ హీరోయిన్ ని ఫైనల్ చేయలేదట. హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మేమే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తామని చెప్పుకొచ్చాడు. దాంతో రష్మిక విషయంలో వచ్చిన రూమర్ కి చెక్ పెట్టినట్టైంది.