Russia – Ukraine War: రష్యా – ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఓ వైపు రష్యా మిత్ర దేశం, మరో వైపు ఉక్రెయిన్ భారత్ మద్దతు కోరుతోంది. ప్రస్తుతానికి భారత్ తటస్థ వైఖరి అవలంబిస్తొంది. ఈ ఉదయం నుండి ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య చేపట్టిన నేపథ్యంలో ఉక్రెయిన్ లో ఉన్న భారత పౌరులు, విద్యార్ధులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సుమారు 20వేల మంది భారతీయులు ఉక్రెయిన్ లో ఉన్నట్లు సమాచారం. ఉక్రెయిన్ లో రష్యా సైనిక చర్య చేపట్టిన నేపథ్యంలో ఆ దేశం గగనతలాన్ని మూసివేసింది. దీంతో విమాన సర్వీసులు నిలిచిపోయాయి.
Read More: Russia Ukraine War: మోడీ పై భారం.. పుతిన్తో మాట్లాడండి సారూ..
Russia – Ukraine War: ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో భారత పౌరులు పడిగాపులు
వేల సంఖ్యలో భారతీయులు ఉక్రెయిన్ నుండి రాలేని పరిస్థితి నెలకొంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో వందల సంఖ్యలో భారత పౌరులు పడిగాపులు కాస్తున్నారు. ఈ తరుణంలో ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఈ ఉదయం ఢిల్లీ నుండి బయలుదేరిన ఎయిరిండియా ప్రత్యేక విమానం వెనక్కివచ్చింది. దీంతో ఇతర మార్గాల్లో వారిని తీసుకువచ్చే ప్రయత్నాల్లో నిమగ్నమైంది.
Read More:Russia Ukraine: మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా..!? రష్యా – ఉక్రెయిన్ గొడవ ఎక్కడికి..!?
తీసుకోవాల్సిన చర్యలపై
కాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కొద్ది సేపటి క్రితం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, పలు విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యుద్ధ పరిణామాలు, భారత్ పై తక్షణ ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం.
Read More: Ukraine War: యుద్ధం మొదలైంది..ఎవరూ జోక్యం చేసుకోవద్దంటూ ప్రపంచ దేశాలకు పుతిన్ హెచ్చిరిక..