Russia – Ukraine War: యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో రష్యాతో బెలారస్ లో చర్చలు జరిపేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తిరస్కరించారు. నాలుగు రోజులుగా ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య కొనసాగుతోంది. రష్యా దాడులను ఉక్రెయిన్ ప్రతిఘటిస్తోంది. ఈ యుద్ధం వల్ల ఉక్రెయిన్ కు భారీ నష్టం జరుగుతుండగా, ఉక్రెయిన్ ఎదురుదాడితో రష్యాకు కొంత మేర నష్టం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో పలు దేశాలు యుద్ధాన్ని నిలిపివేసి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో రష్యా చర్చలకు అంగీకరించింది. బలారస్ దేశంలోని గోమెల్ నగరంలో ఏర్పాటు చేస్తున్న చర్చలకు రావాలని ఉక్రెయిన్ కు రష్యా వర్తమానం పంపింది.
Read More: Ukraine crisis: 24 గంటల్లో 709మంది.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలుపుతున్న విద్యార్థులు
Russia – Ukraine War: ఈ దేశాలలో చర్చలకైతే ఉక్రెయిన్ సిద్ధం
రష్యా పంపిన ప్రతినిధి బృందం గోమెల్ నగరానికి చేరుకుంది. ఉక్రెయిన్ ప్రతినిధి బృందం రాకకోసం ఎదురుచూస్తోంది. అయితే బెలారస్ లో చర్చలు జరిపేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తిరస్కరించారు. తమ దేశంపై రష్యా చేస్తున్న దాడుల్లో కొన్ని బెలారస్ గడ్డ పై నుండి జరుగుతున్నాయనీ జెలెన్ స్కీ అన్నారు. ఉక్రెయిన్ పై దూకుడు స్వభావం ప్రదర్శించని ప్రాంతంలో మాత్రమే చర్చలు జరపడానికి వస్తామని జెలెన్ స్కీ పేర్కొన్నారు. ఉక్రెయిన్ పై క్షిపణులు ప్రయోగానికి వేదికలు కాని దేశాల్లో చర్చలు జరిపేందుకు సిద్ధమని జెలెన్ స్కీ చెప్పారు. వార్సా, ఇస్తాంబుల్, బకులలో శాంతి చర్చల వేదికను ఏర్పాటు చేయవచ్చని సూచించారు.
రష్యా క్రూయిస్ మిసైల్ ను ఉక్రయిన్ వాయుసేన కూల్చేసింది
రష్యా దళాలు అత్యంత కిరాతకంగా వ్యవహరించాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పేర్కొన్నారు. ఉక్రెయిన్ లో సామాన్య ప్రజలు నివసించే ప్రాంతాలపై రష్యన్ దళాలు బాంబులు కురిపిస్తున్నాయన్నారు. మిలటరీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లేని, ప్రజలు నివసించే ప్రాంతాల్లో కూడా దాడులు చేశాయని చెప్పారు. అంబులెన్స్ తో సహా ప్రతి దానిపైనా దురాక్రమదారులు దాడి చేస్తున్నారని ఆయన అన్నారు. కాగా బెలారస్ నుండి కీవ్ నగరంపైకి ప్రయోగించిన క్రూయిస్ మిసైల్ ను ఉక్రయిన్ వాయుసేన కూల్చేసిందని ఆ దేశ ఆర్మ్ డ్ ఫోర్సెస్ కమాండర్ ఇన్ చీఫ్ వాలెరీ జలుజ్నీ పేస్ బుక్ పోస్టు ద్వారా వెల్లడించారు. బెలారస్, రష్యా మరొక యుద్ద నేరానికి పాల్పడ్డాయని ఆయన ఆరోపించారు.