రష్యా నుండి ఇండియా వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ రావడం తీవ్ర కలకలాన్ని రేపింది. మస్కో నుండి ఢిల్లీకి వస్తున్న ఏరోఫ్లాట్ ఎస్ యు 232 విమానంలో బాంబు ఉన్నట్లు వచ్చిన సమాచారంతో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజిఐ) విమానాశ్రయం అధికారులు అప్రమత్తమైయ్యారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, రెస్క్యూ టీమ్ లను రంగంలోకి దించారు. మాస్కో నుండి బయలు దేరిన ఆ విమానం శుక్రవారం తెల్లవారుజామున 3.20 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో రన్ వే 29 లో లాండ్ అయ్యింది. ప్రయాణీకులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చి విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే అందులో ఎలాంటి బాంబు కనిపించలేదు. దీంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
AP High Court: హైకోర్టు లో ఏపి సర్కార్ కు షాక్ ల మీద షాక్ లు
ఆ తర్వాత విమానం ల్యాండింగ్ నుండి ప్రయాణీకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్త చర్యగా అన్ని ఏజన్సీలు రాత్రి పూట అరెల్ట్ అయ్యాయి. ప్రస్తుతం ఎయిర్ క్రాఫ్ట్ మొత్తం తనిఖీలు జరుగుతుండగా ఎయిర్ పోర్టు లో బాంబు డిస్పోజల్ స్క్వాడ్ ను మోహరించారు. ప్రయాణీకులందరి లగేజీలను ఒక్కొక్కటిగా తనిఖీ చేస్తున్నారు. భద్రతా పరంగా విమానాశ్రయం మొత్తం హై అలర్ట్ గా ఉంచారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. బాంబు బెదిరింపు కాల్స్ రావడం ఇదే ప్రధమం కాదు. ఇంతకు ముందు గత నెల 10వ తేదీన కూడా లండన్ కు వెళ్లే ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో భద్రతా సంస్థలు అప్రమత్తమై తనిఖీలు జరిపారు.
ఏపిలో ప్రవేశించిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర