ఆర్ ఎక్స్ 100 వంటి సంచలన విజయం అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి. ఆ తర్వాత సినిమా ‘మహా సముద్రం’ కోసం నానా తంటాలు పడుతున్నాడు. ఈ ఒక్క కథ పట్టుకొనే దాదాపు రెండేళ్ళుగా తిరుగుతున్నాడు. ముందు ఈ సినిమాలో రవితేజ హీరో అనుకున్నాడు. రవితేజ నో చెప్పాక నాగచైతన్య చేస్తున్నాడని చెప్పుకొచ్చారు. కాని నాగ చైతన్య కూడా తప్పుకున్నాడు. ఇప్పుడు శర్వానంద్ తో తీయబోతున్నాడు. బొమ్మరిల్లు సినిమాతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సిద్దార్థ్ సెకండ్ హీరోగా నటిస్తున్నాడని తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఇన్నాళ్ళు క్లారిటీ లేదు. ఒక దశలో మళ్ళీ పాయల్ రాజ్ పుత్ నే తీసుకోవాలనుకున్నాడు. ఆ తర్వాత అనుపమ పరమేశ్వరన్ పేరు కూడా ప్రస్తావనకి వచ్చింది. ఈ ఇద్దరు కాకుండా అదితీ రావు హైదరీ పేరు వార్తలో నిలిచింది. కాని వీళ్ళెవరు కాదని తాజా సమాచారం. దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాలో శర్వానంద్ కి జంటగా బాలీవుడ్ హీరోయిన్ ‘దివ్యాంశ కౌశిక్’ను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మజిలీ సినిమాలో చైతుకు జోడిగా ఫస్టాఫ్ లో నటించి మెప్పించిన ‘దివ్యాంశ కౌశిక్’. ఆ తర్వాత టాలీవుడ్ నుంచి మళ్ళీ ఒక్క ఆఫర్ కూడా రాలేదు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ సినిమాలో అవకాశం వచ్చిందని తెలుస్తుంది.
ఇక ఈ సినిమా కంప్లీట్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం శర్వానంద్ శ్రీకారం అన్న సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మరో శతమానం భవతి లా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ మధ్య వరసగా ఫ్లాపులొస్తున్న శర్వానంద్ చాలా నమ్మకం పెట్టి చేసిన జాను కూడా దారుణమైన ఫ్లాప్ గా మిగిలింది. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించగా దిల్ రాజు నిర్మించారు. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన 96 కి రీమేక్ గా రూపొందింది జాను.