Mahesh Babu: సౌత్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీలో సైమా అవార్డు జాల ప్రతిష్టాత్మకం అని అందరికీ తెలుసు. సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ సైమా అవార్డుల ప్రధానోత్సవం ఎప్పుడు చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు నిర్వాహకులు. ఈ క్రమంలో ఈ సారి హైదరాబాద్ నగరంలో.. అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించడంతో.. సౌత్ ఇండస్ట్రీ కి చెందిన చాలా మంది హాజరయ్యారు. సూపర్ స్టార్ మహేష్ బాబు అదే రీతిలో డైరెక్టర్ వంశీ పైడిపల్లి నిర్మాత దిల్ రాజుతో పాటు సీనియర్ నటుడు మురళీ మోహన్.. మరికొంతమంది టాలీవుడ్ పెద్దలు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో 2019 2021 లో విడుదలైన సినిమాలకు సంబంధించి.. అవార్డులను రిలీజ్ చేయడం జరిగింది.
ఈ అవార్డుల ప్రదానోత్సవంలో ఉత్తమ నటుడు గా మహేష్ ఎంపికయ్యారు. 2019 వ సంవత్సరం లో రిలీజ్ అయిన.. మహర్షి సినిమాలో నటించి అవార్డు అందుకున్నారు మహేష్. ఇదే సినిమాకి “ఇదే కదా..” అనే పాటకు ఉత్తమ గీత రచయిత శ్రీమణి కి అవార్డు లభించింది. మజిలీ చిత్రంలో ప్రియతమా ప్రియతమా పాటకు ఉత్తమ గాయనిగా చిన్మయి..శ్రీ పాదకూ.. అవార్డు వచ్చింది. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా లో టైటిల్ సాంగ్ పాడిన అనురాగ్ కులకర్ణి కి ఉత్తమ గాయకుడిగా సైమా అవార్డు సొంతం చేసుకున్నారు.
ఉత్తమ తొలి చిత్రం అవార్డు కేటగిరీలో స్టూడియో 99కి పురస్కారం. ‘మల్లేశం’ చిత్రానికి ఈ అవార్డు ప్రదానం. స్టూడియో 99 తరఫున అవార్డును దిల్ రాజు అందుకున్నారు. అరంగేట్రంలో అద్భుత నటన కనబర్చిన కేటగిరీలో శివాత్మిక రాజశేఖర్ కు బెస్ట్ డెబ్యూ అవార్డు.బెస్ట్ డెబ్యూ మేల్ కేటగిరీలో కోడూరి శ్రీసింహాకు అవార్డు. ‘మత్తు వదలరా’ చిత్రానికి గాను పురస్కారం. ఏజెంట్ సాయి శ్రీనివాస్ చిత్రానికి గాను బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా స్వరూప్ కు సైమా అవార్డులు లభించాయి.