ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడైన సబ్బం హరి కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. గతంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కు అభిమానిగా ఉండే ఆయన అతని దయ వల్ల అనకాపల్లి ఎంపీగా అయ్యారు. ఆ తర్వాత జగన్ కు సన్నిహితంగా అయినట్లు కనిపించినా గత ఎన్నికలకు ముందు అనూహ్యంగా బాబుని తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టారు. వైఎస్ హయాంలో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన… వైజాగ్ నగర మేయర్ గా పనిచేశారు. ఇక ఆయనకు వాగ్ధాటి ఉన్న కారణంగా అతనిని మరింత ప్రోత్సహించి వైఎస్ అనకాపల్లి నుండి ఎంపీ గా పోటీ చేయించారు. ట్రయాంగిల్ పోటీలో ఎంపీగా గెలిచి లోల్ సభ లో అడుగు పెట్టారు.
అయితే కృతజ్ఞత మరిచారో లేదా టిడిపిలో తనకు ఎక్కువ గుర్తింపు మరియు ప్రాధాన్యత ఉంటుంది అని తలచారో వైఎస్ మరణానంతరం జగన్ కు అనుకూలంగా మీడియాలో తన బలమైన వాయిస్ వినిపించిన ఆయన…. ఒక్కసారిగా 2014 ఎన్నికల్లో వైసీపీ నుండి సీటు ఆఫర్ వచ్చిన పోటీ చేయకుండా దూరంగా ఉన్నారు. ఇక ఐదేళ్లపాటు పరిస్థితిని బేరీజు వేసుకుంటూ అటూ ఇటూ ఊగిసలాడి చివరికి చంద్రబాబు చెంతకు వచ్చారు. భీమిలిలో ప్రస్తుత మంత్రి అవంతి శ్రీనివాస్ తో పోటీచేసి జగన్ ధాటిని తట్టుకోలేక ఓడిపోయారు.
ఇప్పుడు బాబుని ఒక విషయంలో వ్యతిరేకిస్తున్న సబ్బంహరి ఎప్పటినుండో టిడిపి తో మంచి సఖ్యతతో లేరు. గత ఎన్నికలకు ముందు సబ్బం తనకు పట్టు ఉన్న అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వాలని కోరినా కూడా భీమిలిలో అవంతిపై కావాలని పోటీ చేయించారు. అప్పటికే అక్కడ నుండి ఓటమి భయంతో గంట విశాఖ నార్త్ కు వెళ్లి సేఫ్ అయిపోతే…. విచిత్రంగా గంటా నార్త్ లో గెలిస్తే అవంతి భీమిలిలో అవంతి ఓడిపోయాడు. తనకు భీమిలి అసలు కలిసిరాదని తెలుసుకుని మళ్లీ అనకాపల్లి లోక్సభ నియోజకవర్గ బాధ్యతలు ఇవ్వాలని చంద్రబాబుని సబ్బం కోరుతున్నారట
చంద్రబాబు మాత్రం అందుకు పెద్దగా సముఖంగా లేనట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆయన టిడిపిని వదిలి గంట బాటలోనే వైసిపికి చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గంటా తో మంతనాలు జరిపి అతని తో పాటు ముందుగా అధికార వర్గం లోకి అడుగుపెట్టి జగన్ ను ప్రసన్నం చేసుకుని మళ్ళీ రాజ్యసభలో అడుగుపెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారట హరి. ఇక ఇంత ధైర్యం చేయడానికి పైన ఉన్నవన్నీ సబ్బం హరి కి బలమైనకారణాలు కాగా అతని వాదనతో ఏకీభవించకుండా ఎవరూ కుండా ఉండలేరు కూడా.