Sachin Tendulkar : దేశ వ్యాప్తంగా రైతులు చేస్తున్న ఉద్యమం ఉన్న కొద్దీ ఉదృతంగా మారుతుంది.
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన రైతు చట్టాలను రద్దు చేయాలని రైతులు గత రెండు నెలల నుండి ఢిల్లీ సరిహద్దుల్లో భారీ స్థాయిలో ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ ఉద్యమం జనవరి 26 వ తారీకు గణతంత్ర దినోత్సవం నాడు హింసాత్మకంగా మారడంతో.. అంతర్జాతీయ స్థాయిలో రైతులు చేసిన ఉద్యమానికి చాలామంది దేశాధి నేతలు మద్దతు పలుకుతున్నారు. అధికారంలో ఉన్న బిజెపి రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే రైతుల ఉద్యమానికి ఇప్పటికే ప్రముఖ సింగర్ నటి రాబిన్ రిహన్నా స్వీడన్ పర్యావరణ ప్రేమికురాలు గ్రెటా థంబర్గ్ లు రైతుల ఉద్యమాన్ని సపోర్ట్ చేయడం జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో మాత్రమే కాక దేశంలో చాలామంది సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఎప్పుడూ కోపం తెచ్చుకొని క్రికెటర్ మరియు గ్రౌండ్ లో కూడా చాలా కూల్ గా ఉంటూ ప్రత్యర్థులకు తన బ్యాట్ తో మాత్రమే సమాధానం చెప్పే.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పందించారు. దేశ వ్యాప్తంగా రైతులు ఆందోళనలకు తన మద్దతు తెలుపుతున్నట్లు స్పష్టం చేశారు. సచిన్ ట్విటర్లో ఏమని స్పందించారు అంటే ‘భారతదేశ సార్వభౌమాధికారం విషయంలో ఏమాత్రం రాజీపడాల్సిన అవసరం లేదు. బయట వ్యక్తులు కేవలం ప్రేక్షకులు మాత్రమే. పాల్గొనేవారు కాదు.. భారత్ అంటే ఏంటో భారతీయులకే తెలుసు.. దేశానికి ఏం కావాలో దేశమే నిర్ణయిస్తుంది. ఒక జాతిగా అందరం ఐక్యంగా ఉందాం’ అని ట్వీట్ చేశారు.