Sadhguru: సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ పర్సనాలిటీ అని చెప్పొచ్చు. యోగా గురువు, ఆధ్యాత్మికత ప్రతిపాదకుడిగా జగ్గీ వాసుదేవ్ ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. ఈషా ఫౌండేషన్ సంస్థాపకులైన సద్గురు చెప్పే మాటలు చాలా మందికి బంగారు మాటలని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే పదేళ్ల ప్రాయంలోనే యోగా నేర్చుకున్న వాసుదేవ్ తన టీనేజ్ వయసులోనే బైకులపై అమిత ఇష్టం పెంచుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అతనికి బైక్ రైడింగ్ పై ఏ మాత్రం ఇష్టం తగ్గలేదు. అందుకే 64 ఏళ్ల వయసులోనే వీలు చిక్కినప్పుడల్లా బైకులపై చక్కర్లు కొడుతుంటారు సద్గురు.
Shruthi Hassan: పాపం శృతి హాసన్ ఎలా అయిపోయిందో తెలిస్తే ఏడ్చేస్తారు.. ఇటువైపు ఓ లుక్కేసి మీరే చూడండి!
Sadhguru: బైక్ రైడ్ లో సద్గురు:
అయితే తాజాగా ఇప్పుడు ఆయన సోలోగా ఒక అదిరిపోయే బైక్ రైడ్ చేపట్టడానికి సిద్ధమయ్యారు. తాను ఒక మోటార్ సైకిల్ యాత్ర చేపట్టబోతున్నానని, అది కూడా సోలోగా అని మహా శివరాత్రి రోజు జరిగిన మహోత్సవంలో వాసుదేవ్ తెలిపారు. సద్గురు లండన్ నుంచి భారత్ వరకు వంద రోజుల్లో మోటార్సైకిల్పై యాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్రలో భాగంగా తాను పర్యటించే ప్రతి దేశంలో భూసారాన్ని పరిరక్షించుకునేందుకు సరైన చర్యలు తీసుకోవాలని అక్కడ పాలకులకు విజ్ఞప్తి చేస్తానని వెల్లడించారు. ఈ టూర్ లేదా క్యాంపెయిన్ లో భాగంగా సద్గురు 100 రోజుల్లో 27 దేశాల్లో 30 వేల కిలోమీటర్ల పాటు ప్రయాణించనున్నారు.
YSRCP: జగన్ కి ఊహించని కష్టాలు..! సెన్సేషనల్ నిర్ణయం తప్పదేమో..!?
సద్గురు జగ్గీ వాసుదేవ్ పుడమి తల్లి గురించి చేస్తున్న ఆలోచనలు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. శాస్త్రవేత్తల ప్రకారం భూమి మరో 55 ఏళ్లు పాటు మాత్రమే వ్యవసాయానికి పనికి వస్తుందని ఆ తర్వాత ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారని వాసుదేవ్ చెబుతున్నారు. అందుకే ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరూ భూసారం గురించి ఆలోచించాలని, ఆహార ఉత్పత్తిపై దృష్టి సారించకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆయన హెచ్చరిస్తున్నారు.
YSRCP: జగన్ కి ఊహించని కష్టాలు..! సెన్సేషనల్ నిర్ణయం తప్పదేమో..!?
అలాగే సేవ్ సాయిల్ అనే తన ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని పిలుపునిస్తున్నారు. తనకిష్టమైన బైక్ పై రైడ్ చేస్తూ ప్రపంచ దేశాల్లో భూసార పరిరక్షణ గురించి అవగాహన పెంచుకున్న సద్గురుని ప్రతి ఒక్కరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?