కుమార్తెలతో పొలం దున్నింది సరదా కోసమే ప్రభుత్వం సీరియస్..అన్ని పధకాల్లోనూ లబ్దిదారులే ఇద్దరు కుమార్తెలతో దుక్కి దున్నుతున్న ఓ రాయలసీమ రైతు వీడియా హల్ చల్ చేసింది. దీనికి స్పందించి బాలీవుడ్ నటుడు సోనూసూద్ ట్వీట్లు చేయటంతో పాటుగా ఏకంగా వారికి ట్రాక్టర్ కూడా పంపారు.
దీంతో..సోనూసూద్ ను అందరూ ప్రశంసలతో ముంచెత్తారు. ఇదే కోవలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం స్పూర్తి సందేశాలు ఇచ్చారు. ఇంతలో ఈ వ్యవహారం పైన ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అసలు ఈ రైతు పరిస్థితి ఏంటి.. కుమార్తెలతో దుక్కి దున్నించాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందో వివరాలు ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించింది. అయితే అసలు విషయం అప్పుడు బటయకు వచ్చింది. తాను మదనపల్లిలో టీ కొట్టు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నానని..కరోనా కారణంగా స్వగ్రామం వచ్చానని చెబుతూ వెంటనే ట్రాక్టర్..ఎడ్లను తెచ్చే అవకాశం లేక కుటుంబ సభ్యులతో కలిసి పొలం దున్నామని..
అయితే అరుదుగా జరిగే విషయం కావటంతో వీడియో తీసామని చెప్పుకొచ్చారు. అదే సమయంలో అసలు విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఈ వ్యవహారం వైరల్ గా మారింది.
సరదాగానే కుటుంబ సభ్యులతో కలిసి..
చిత్తూరు జిల్లా మహల్రాజుపల్లి రైతు నాగేశ్వర్రావు తన కుటుంబానికి చెందిన పొలంలో వేరు శనగ పంట వేయటానికి నిర్ణయించారు. ప్రస్తుతం వర్షాలు సైతం కురుస్తుడటంతో తాను పొలం వేయాలని డిసైడ్ అయ్యారు. అయితే, వెంటనే ట్రాక్టర్..ఎడ్లను తీసుకురావాలని భావించినా సమయం పడుతుందని అంచనా వేసారు. దీంతో..కుటుంబ సభ్యులతో కలిసి దుక్కి దున్నటం ప్రారంభించారు. దీనిని వీడియో కూడా తీసారు. దీనిని తమ వారితో పాటుగా తెలిసిన వారికి షేర్ చేసారు. అయితే, ట్రాక్టర్..ఎడ్లు లేని కారణంగానే నాగేశ్వరరావు తమ కుమార్తెలతో దుక్కి దున్నిస్తున్నట్లుగా వీడియో వైరల్ అయింది. ఇది చివరకు సోనూ సూద్ కు సైతం చేరింది. దీనికి ఆయన ట్వీట్లు చేయటంతో పాటుగా వెంటనే వారికి ట్రాక్టర్ సైతం పంపించారు. దీంతో సోనూ సూద్ ను అనేక మంది అభినందించారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఇందులో ఉన్నారు. నాగేశ్వరరావు ఇద్దరు కుమార్తెలను పార్టీ చదివిస్తుందని ప్రకటించారు. దీంతో..ప్రభుత్వం అసలు ఈ నాగేశ్వరరావు కుటుంబ పరిస్థితి..ప్రభుత్వ పరంగా అందుకుంటున్న లబ్ది గురించి పూర్తి వివరాలు పంపాలన స్థానిక రెవన్యూ అధికారులను ఆదేశించింది.
ప్రభుత్వం నుండి భారీ లబ్ది..సరాదా కోసమేనంటూ..
ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన రెవిన్యూ అధికారులు అసలు లెక్కలు బయట పెట్టారు. గత ఏడాది నాగేశ్వర రావు కుంటుంబానికి రైతు భరోసా కింద రూ. 13,500 నేరుగా నాగేశ్వర్రావు ఖాతాలో జమ అయింది. ఈ ఏడాది రైతు భరోసాలో భాగంగా ఇప్పటివరకూ రూ.7500 బదిలీ జరిగింది. చిన్నకూతురుకు జగనన్న అమ్మ ఒడి కింద గత జనవరిలో రూ.15,000 అందుకున్నారు.పెద్ద కూతురు జగనన్న తోడు కింద లబ్ధికోసం దరఖాస్తు చేశారు.తల్లి అభయహస్తం కింద పెన్షన్ అందుకుంటోంది. నాగేశ్వర్రావు తండ్రి వృద్ధాప్య పెన్షన్ కింద ప్రతి నెలా రూ.2250లు అందుకుంటున్నారు.
కరోనా సమయంలో పేద కుటుంబాలను ఆదుకునేందుకు ప్రతి కుటుంబానికి అందించిన రూ.1000 సహాయాన్ని నాగేశ్వర్రావు కుటుంబం అందుకుంది. ఉచిత రేషన్కూడా తీసుకుంది. తనకున్న 2 ఎకరాల పొలంలో వేరు శెనగ వేయడానికి రైతు భరోసా కేంద్రం నుంచి డీఏపీ ఎరువు, విత్తనాలు తీసుకున్నారు. జరుగుతున్న వ్యవహారం పైన ప్రభుత్వం సీరియస్ గా ఉందని గ్రహించిన నాగేశ్వర రావు తాను సరదా కోసమే దుక్కి దున్ని వీడియో తీసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ విషయంలో ఒత్తిడికి లోనవుతున్న నాగేశ్వరరావు తనకు సోనూ సూద్ నుండి వచ్చిన ట్రాక్టర్ ను తిరిగి ఇచ్చేస్తానని.. ఆయన వద్దంటే గ్రామ పంచాయితీకి అందిస్తానని చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.