ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన మత్స్య శాఖ విభాగం, విశాఖపట్నం జిల్లా లోని సాగర్ మిత్ర పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. మొత్తం 43 పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనుంది.. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులను విశాఖపట్నం షిప్పింగ్ హార్బర్ నందు స్వయంగా గాని పోస్ట్ ద్వారా గాని పంపించవచ్చు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. ఇందులో 80% పోస్టులను లోకల్ వారికీ, 20% పోస్టులను నాన్ లోకల్ వారికీ కేటాయించారు..
మొత్తం ఖాళీలు :43
విభాగాలు : సాగర్ మిత్ర
అర్హత లు :
ఫిషరీస్ లో పాలిటెక్నిక్ డిప్లమా, ఫిషరీ సైన్స్, మెరైన్ బయాలజీ, జువాలజీ లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. ఈ విద్యార్హత కలిగిన అభ్యర్థులకు ప్రథమ ప్రాధాన్యతనిస్తారు.
వయసు : 30 -11-2020 నాటికి 18- 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఇంటర్వ్యూ లో అకాడమిక్ మెరిట్ కు 75 మార్కులు, సాఫ్ట్ స్కిల్స్ కు 10 మార్కులు, ఇంటర్వ్యూ కు 15 మార్కులు విభజించారు. మొత్తం 100 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ పోస్టులకు 80 శాతం స్థానిక అభ్యర్థులకు 20 శాతం ఆంధ్రప్రదేశ్లోని మిగతా జిల్లాల అభ్యర్థులకు కేటాయిస్తారు. సంబంధిత గ్రామంలో నివాసం ఉంటున్నట్లు డిక్లరేషన్ ఫామ్ సమర్పించాలి.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ : 16 /1/2021
దరఖాస్తులు పంపించవలిసిన చిరునామా :
మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు, విశాఖపట్నం (ఫిషింగ్ హార్బర్), చిరునామాకు స్వయంగా గాని పోస్టు ద్వారా గాని పంపించవచ్చు.