Pawan Kalyan: గతనెల మెగాహీరో సాయిధరమ్ తేజ్.. బైక్ యాక్సిడెంట్ కి గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోమాలోకి వెళ్ళిపోయిన.. సాయి ధరమ్ తేజ్ కొద్దిరోజులకు తేరుకొని.. సర్జరీ చేయించుకోవడం జరిగింది. దాదాపు 35 రోజుల పాటు సాయి ధరంతేజ్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందారు. భారీ మేజర్ యాక్సిడెంట్ కావడంతో ఇండస్ట్రీ తో పాటు అభిమానులు చాలామంది సెలబ్రిటీలు సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కి సంబంధించి స్పందించడం జరిగింది.
మంచి మనస్తత్వం ఉన్న హీరో కావటంతో పాటు పెద్దలు అంటే మంచి గౌరవం ఉండటంతో సాయి ధరంతేజ్ త్వరగా కోలుకోవాలని అనేకమంది సోషల్ మీడియాలో.. పోస్టులు పెట్టడం మాత్రమే కాక మరి కొంతమంది భగవంతునికి ప్రార్థన లు కూడా చేయడం జరిగింది. ఇదిలా ఉంటే సరిగ్గా దసరా రోజు.. సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకుని ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో స్పందించారు. ముందుగా పవన్ కళ్యాణ్ పెట్టిన పోస్ట్ చూస్తే ఈ విధంగా ఉంది…‘అనుకోని రీతిలో ప్రమాదం బారిన పడి గత నెల రోజులుగా చికిత్స పొందిన సాయి ధరమ్ తేజ్ కోలుకొని ఈ రోజు క్షేమంగా ఇంటికి చేరాడు.
మెగాస్టార్ చిరంజీవి కామెంట్ …
విజయదశమి పర్వదినాన తేజ్ ఆరోగ్యంగా ఇంటికి రావడం మా కుటుంబం అందరికి ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ రోజు తేజ్ పుట్టిన రోజు. భవిష్యత్లో మరిన్ని విజయాలు అందుకొని ప్రేక్షకుల ప్రేమాభిమానాలు మరింతగా పొందాలని శక్తి స్వరూపిణిని ప్రార్ధిస్తున్నాను. తేజ్ ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి అభిమానులు ఎంతో బాధపడ్డారు’ అని అన్నాడు. దాదాపు 35 రోజుల పాటు.. ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి.. చేరుకున్నారని మెగాస్టార్ చిరంజీవి తెలియజేస్తూ నీకు పునర్జన్మ ఈ దసరా పండుగకు పూర్తిగా.. కోలుకొని.. ఇంటికి చేరుకున్నావు అంటూ.. కామెంట్ చేశారు. సాయి ధరమ్ తేజ్.. పూర్తిగా కోలుకుని ఇంటికి చేరుకోవడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.