సాయి ధరం తేజ్ వరసగా రెండు వరసగా చిత్రల హరి, ప్రతి రోజూ పండుగే సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఇప్పుడు సోలో బ్రతుకే సో బెటర్ అన్న సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడు. ఈ నెల 25 న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. నభా నటేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి సుబ్బు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా రిజల్ట్ మీదే నెక్స్ట్ చాలా సినిమాల రిలీజ్ ఆధారపడి ఉందని ప్రచారం అవుతోంది. ఈ విషయంలో మెగా మేనల్లుడు ని ప్రశంసిస్తున్నారు కూడా.
కాగా ప్రస్తుతం సాయి ధరం తేజ్ ప్రస్థానం ఫేం దేవాకట్ట దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెల్సిందే. ఇంటెన్స్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఇప్పటి వరకు ఇలాంటి కథ చేయకపోవడం తో సాయి ధరం తేజ్ చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాడట. ఇక ఈ సినిమాని ప్రముఖ నిర్మాతలు జె. భగవాన్ పుల్లారావు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ని సాయి ధరం తేజ్ కన్ఫర్మ్ చేసినప్పటి నుంచే కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ప్రస్థానం సినిమా తో దర్శకుడు దేవాకట్ట విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అంతేకాదు ఈ సినిమాని హిందీలో తీసి కూడా మంచి హిట్ అందుకున్నాడు. కాగా తెలుగులో దేవాకట్ట అంత క్రేజీ ప్రాజెక్ట్స్ గాని బ్లాక్ బస్టర్ సినిమాలు గాని చేసింది లేదు. అయినా మెగా హీరో అవకాశం ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ సినిమాని దేవాకట్ట అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడని ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని సాయి ధరం తేజ్ ఫ్లాప్ డైరెక్టర్ గా చెప్పుకుంటుంటున్న దేవాకట్ట మీద నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నాడట. అయితే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కూడా ఫ్లాప్ డైరెక్టర్ గా పేరున్న మెహర్ రమేష్ కి వేదాలం తెలుగు రీమేక్ బాధ్యతలు అప్పగించి షాకిచ్చాడు. సాయి తేజ్ కూడా అదే ఫాలో అవుతు దర్శకులలో ఉన్న టాలెంట్ ని నమ్ముతు మెగాస్టార్ తో పోల్చుకునేలా చేశాడని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారట.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?