సాయి పల్లవి వెండితెరకు మలయాళ చిత్రం ‘ప్రేమమ్’తో పరిచయం అయింది. ఆ తర్వాత టాలీవుడ్ ఫిదా సినీఅ చేసి మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఆ సినిమా తర్వాత తెలుగు చిత్రపరిశ్రమలో వరుస అవకాశాలతో దూసుకెళుతుంది. క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ నాచ్యూరల్ బ్యూటీ తర్వాత “కలి” అనే మలయాళ చిత్రం చేయగా అది తమిళంలో కూడా పెద్ద విజయాన్ని సాధించింది.. తెలుగులో హేయ్.. పిల్లగాడ అనే పేరుతో డబ్ చేశారు.
ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రంలో పక్కా తెలంగాణ అమ్మాయి పాత్రలో నటించి టాలీవుడ్ ప్రేక్షకుల మనసులు దోచుకుంది. ఈ క్రమంలో తెలుగులో ‘ఎంసీఏ’ ‘పడి పడి లేచే మనసు’ ‘కణం’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా కెరీర్ స్టార్టింగ్ నుండి కమర్షియల్ సినిమాల వైపు అడుగు వేయకుండా.. గ్లామర్ షో కు ఆమడ దూరంలో ఉంటూ వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ వరుసగా అవకాశాలను చేజిక్కుంచుకుంటుంది.
ఎలాంటి పాత్రనైన తన అందం, అభినయంతో ఆకట్టుకునే సాయి పల్లవి మంచి డ్యాన్సర్ కూడా ఆకట్టుకుంటూ సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతోంది. ఇక సాయి పల్లవి ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘లవ్ స్టోరీ’, దగ్గుబాటి రానా ‘విరాటపర్వం’ సినిమాల్లో నటిస్తోంది. వీటితో పాటు ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో, నేచురల్ స్టార్ నాని కి జంటగా ‘శ్యామ్ సింగరాయ్” సినిమాలో అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ చిత్రంతో సాయి పల్లవి రెమ్యునరేషన్ భారీగా పెరిగినట్లు ఒక వార్త సినివర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. ఎంతలా అంటే ఈ చిత్రం కోసం ఏకంగా రూ.2 కోట్ల పారితోషికం అందుకుంటుందట. ఒకవేళ ఇదే కనుక నిజమైతే సాయి పల్లవి కెరీర్లో అత్యధిక పారితోషికం ఇదేనని చెప్పాలి. మొత్తానికి నేచురల్ బ్యూటీ ఒక హీరో స్దాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!