ఫిదా బ్యూటీ సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలు చేస్తోంది. ఈ మూడు పెద్ద బ్యానర్స్ లో చేస్తున్న సినిమాలే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య హీరోగా వస్తున్న లవ్ స్టోరీ అన్న సినిమా కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కారక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ లో ఉన్నారు.
ఇక రానా దగ్గుబాటి నటిస్తున్న విరాట పర్వం అన్న సినిమాలో ప్రియమణి తో కలిసి సాయి పల్లవి కూడా నటిస్తుంది. ఈ సినిమాలో ఇద్దరు నక్సలైట్ పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి ది ఛాలెంజింగ్ రోల్ అని అంటున్నారు. ఈ సినిమా కూడా ఈ ఏడాదే రిలీజ్ కావాల్సి ఉండగా లాక్ డౌన్ కారణంగా వచ్చే సంవత్సరానికి పోస్ట్ పోన్ అయింది.
ఇక మరోసారి నేచురల్ స్టార్ నాని కి జంటగా శ్యామ్ సింగ్ రాయ్ అన్న సినిమా చేస్తోంది. ఈ సినిమా డిసెంబర్ నుంచి సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. ఈ సినిమాలో సాయి పల్లవి పాత్రకి చాలా ప్రాధాన్యం ఉందని సమాచారం. ఇక మరో హీరోయిన్ గా ఉప్పెన ఫేం కృతి శెట్టి నటిస్తుంది. అయితే సాయి పల్లవి నే ఎక్కువగా శ్యామ్ సింగ్ రాయ్ లో హైలెట్ కానుందని అంటున్నారు.
అయితే గత కొన్ని రోజులుగా సాయి పల్లవి వరసగా పెద్ద బ్యానర్స్ నుంచి స్టార్ హీరోలు నటించే సినిమాలలో అవకాశం వచ్చిన సున్నితంగా తిరస్కరిస్తుందని అంటున్నారు. మెగాస్టార్ నటించబోతున్న వేదాళం లో చెల్లి పాత్ర కి సాయి పల్లవి ని అడిగారట. అలాగే పవన్ కళ్యాణ్ నటించబోయే ఒక రీమేక్ సినిమాలో కూడా సాయి పల్లవి ని అడిగినట్టు సమాచారం.
ఇక అనిల్ రావిపూడి ఎఫ్ 3 తెరకెక్కించేందుకు సమయం ఉండటంతో ఈలోపు ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయాలని డిసైడయి సాయి పల్లవిని తీసుకోవాలనుకున్నాడట. కాని ఈ మూడు సినిమాలలో కథ నచ్చక .. కథ లో తన పాత్ర చాలా తక్కువ నిడివి ఉండటం తో నో చెప్పిందని ప్రచారం అవుతోంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందన్నది మేకర్స్ గాని .. సాయి పల్లవి గాని వెల్లడిచాల్సిందే.